రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత, ఎంపీ అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం చెలరేగింది. అధిర్ రంజన్.. ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అంటూ కామెంట్ చేశారు.
https://twitter.com/ramanathan_b/status/1552510784756150275?s=20&t=mnNiXTYWKWcRQnDfchrqCg
దీంతో లోక్ సభలో బీజేపీ ఆందోళన చేపట్టింది. రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా అవమానించిందని, క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్సభలో డిమాండ్ చేశారు.
దేశ అత్యున్నత పదవిలో ఉన్న ఓ వ్యక్తిని అవమానించేందుకు సోనియా గాంధీ తన సభ్యులకు అనుమతి ఇచ్చిందని స్మృతి ఇరానీ మండిపడ్డారు. సభలో బీజేపీ ఎంపీలు అందరూ లేచి నిలబడి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
https://twitter.com/ANI/status/1552530266148990977?s=20&t=xqdY8daKqbtaEBdGOWIlWQ
ఈ విషయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మండిపడ్డారు. పార్లమెంట్ ఆవరణలో నిర్మలా సీతారామన్ తన తోటి ఎంపీలతో కలిసి ఫ్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అధిర్ రంజన్ వి సెక్సీయెస్ట్ కామెంట్లు అని.. ఇది గిరిజన బిడ్డకు జరిగిన అవమానం అని అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన అవమానమని.. సోనియా గాంధీ భారత రాష్ట్రపతికి, దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
https://twitter.com/ANI/status/1552533565732442112?s=20&t=Utm_VEVPwkNkEyvzndyjNQ
అయితే అనుకోకుండా నోరు జారినట్టు కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరీ అన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై సభా వేదికపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అధీర్ రంజన్ కోరారు.
https://twitter.com/adhirrcinc/status/1552533324458889216?s=20&t=7xdAK-7H3iJXor0ZWaD5Eg