యోగీకి ఓటు వేయకుంటే జేసీబీ, బుల్డోజర్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న రాజాసింగ్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇక ఈసీ ఆయనకు నోటీసులు కూడా జారీచేసింది. ఈసీ నోటీసులపై ఆయన స్పందించారు. అయితే ఉజ్జయిని వెళ్లివచ్చాక సమాధానం ఇస్తానని తెలిపారు. అసలు తన మాటల్ని వక్రీకరిస్తున్నారని… యోగీ ప్రభుత్వం తిరిగి ఏర్పడకపోతే ఏం జరుగుతుందన్నది తాను చెప్పానని వివరణ ఇచ్చారు. యోగీ సీఎం కాకుండా అడ్డుకుంటున్నారని… అఖిలేష్ నాయకత్వంలోని ఎస్పీ కనుక అధికారంలోకి వస్తే మళ్లీ గూండారాజ్ వస్తుందనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశాననిన రాజాసింగ్ అన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)