సమాజంలో వినియోగ దారుడే రారాజు అని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జాస్తి రవికుమార్ అన్నారు. అందుచేత వినియోగదారుని హక్కులు కాపాడటంలో అంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతీ (ఎ బి జి పి)స్వర్ణ( 50 వసంతాలు )జయంతి ఉత్సవాల ముగింపు లో వాగేశ్వరి కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో వినియోగదారుల చట్టం పై అవగాహన సదస్సు ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. జాస్తీ రవి కుమార్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి వినియోగదారుడే ఆని , వస్తువుల కొనుగోలు విషయంలో తగిన అవగాహన కలిగి ఉండాలని , మార్కెట్లో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి వ్యక్తి కొనుగోలు సందర్బంగా క్యాష్ బిల్ తీసుకొని అవసరమైన టాక్స్ కట్టినట్లయితే మోసపోకుండా ఉండే అవకాశం ఉంటుంది అన్నారు. అలాగే, మనం కట్టిన టాక్స్ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడేలా ప్రభుత్వం వెచ్చిస్తుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి లో ఉంటుందని తెలిపారు.
కార్యక్రమ ముఖ్య వ్వక్త గా విచ్చేసిన ప్రజ్ఞాభారతి రాష్ట్ర సహాయ కార్యదర్శి డా. నిరంజనా చారీ మాట్లాడుతూ తప్పుడు ప్రకటనలతో తప్పు దారి పడుతూ, నాణ్యత ప్రమాణాలు లేని వస్తువులు అధిక ధరలకు పొంది మోసపోవడం జరుగుతుందనీ హెచ్చరించారు. అందుకోసం వినియోగహరుల రక్షణ చట్టం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇతరులకు అవగాహన కల్పించాలన్నారు. ఆ దిశలో ఏ బి జి పీ అనేక చైతన్య కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
ఇదే కార్యక్రమంలో అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతీ కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నం మల్లయ్య గౌడ్ ప్రకటించారు.అధ్యక్షులు గా నలువాలా రాజేందర్, ఉపాధ్యక్షులు హరి ప్రసాద్, భగవాన్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కార్యదర్శి సురభి శ్రీధర్, సహాయ కార్యదర్శులు చిదురాల రామ్ మోహన్, రాపర్తి శ్రీనివాస్, కృష్ణమూర్తి, ప్రచార కార్యదర్శి కొత్తకొండ సాయికృష్ణ సభ్యులుగా దండే శ్రీనివాస్, అన్నాడి అశోక్ రెడ్డి, కంది శ్రీనివాస్, అంజిరెడ్డి, కుమారస్వామి లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ జాయింట్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి, అఖిల భారతీయ గ్రహాక్ పంచాయత్ బాద్యులు నాగమల్ల సురేష్, నలువాల రాజేందర్, గండ్ర సత్యనారాయణ రావు, సురభి శ్రీధర్, హరి ప్రసాద్, కొత్తకొండ సాయికృష్ణ,చిదురాల రామ్ మోహన్,అంజిరెడ్డి,కుమారస్వామి, కట్ట రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం ఆసాంతం వినియోగదారుల చైతన్యం దిశగా నిర్వహించారు.