అయోధ్యలో రామాలయం పనులు 2023 చివరికల్లా పూర్తవుతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ఇప్పటికి సగం పనులు పూర్తయ్యాయన్నారు.ఆలయ నిర్మాణానికి సంబంధించి పాలంపూర్లోనే బీజేపీ తొలి తీర్మానం ఆమోదించిందని గుర్తు చేశారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలంపూర్లో బీజేపీ అభ్యర్థి త్రిలోక్ కపూర్ తరపున యోగీ ప్రచారం చేశారు. భవ్య మందిర నిర్మాణం కల 500నాటిదని..త్వరలోనే సాకారం అవబోతోందని తలుచుకుంటే ఆనందంగా ఉన్నారని యోగీ అన్నారు.