
బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విభాగం భారత దేశ అభివద్ధి మీద ఒక రిపోర్ట్ తయారు చేసింది.
దాని ప్రకారం భారతదేశం 1950-2015 మధ్య కాలంలో నిర్మించిన హై వేలు, రైల్వే లైన్స్ తో పోలిస్తే 2015-25 మధ్య ముగిసే దశాబ్దానికి సుమారు రెట్టింపు వేగంతో నిర్మిస్తోంది అని తెలిపింది.
ఆ రిపోర్ట్ ప్రకారం…
* హై వేలు:
1950లో 4000కి. మీ హై వేలు వుంటే 65 సం.లకి అంటే 2015సం.కి అవి 77,000కి.మీ చేరింది. అంటే 65 సం.లలో నిర్మించినవి 73వేల కి.మీ మాత్రమే. అదే 2025కి పూర్తి అవ్వబోయే హై వేలు దూరం 1.80లక్షల కి. మీ అంటే ఈ 10 సం.లో నిర్మిస్తున్న హై వేలు పొడవు లక్ష కి. మీ. పైనే.. అంటే 2015 వరకు నిర్మించిన దానిపై 2025కి అంటే ఒక్క పది సం.లలో 133% పెరుగుదల అంటే అద్భుతమైన ప్రగతి అని ఈ రిపోర్ట్ పేర్కొంది.
* రైల్వే నెట్ వర్క్:
1950లో రైల్వే నెట్ వర్క్ 10 వేల.కి.మీ వుంటే అది 2015కి 63వేల కి. మీ అయింది. అంటే 65 సం.లలో 53 వేల కి.మీ వేశారు. అదే 2025కి ముగిసే దశాబ్దానికి రైల్వే నెట్ వర్క్ 1.20కి.మీ అవుతుంది. అంటే 2015 వరకు ఎంత వుండేదో సుమారు అంత నెట్ వర్క్ ఈ 10 సం.లో పూర్తి అవుతున్నాది.
* పోర్ట్ లలో లోడింగ్ కెపాసిటీ :
1995లో 777MTPA వుంటే 2015 కి అది 1911 MTPA అయింది, అంటే 20 సం.లలో
1134 MTPA పెరిగింది. అది 2025కి 3000 MTPA కి పెరుగుతుంది. అంటే 10 సం.లలో సుమారు 1100 MTPA పెరుగుతుంది
ఆ రిపోర్ట్ ప్రకారం ఇతర వివరాలు :
**పారిశుద్ధ్య సదుపాయం 2015లో 43% నుండి 2021లో 89% మందికి చేరింది.
**వంట గ్యాస్ కవరేజీ 2015లో ఉన్న 56% గృహాల నుండి 2021లో 100%కి చేరుకుంది.
** 2000లో విద్యుత్ సౌకర్యం 56% గృహాలకు ఉంటే ఇప్పుడు విద్యుత్ 96% గృహాలకు ఉంది.
** కుళాయి ద్వారా గృహాలకు నీటి కవరేజీ 2015లో 13% ఉంటే ఇప్పుడు 52% అయింది,
అది 2024 నాటికి 100% కవరేజీ అయ్యే అవకాశం ఉంది అని ఈ రిపోర్టు పేర్కొంది.
** అలాగే పైపు గ్యాస్ కనెక్షన్లు 2015లో 2.5 మిలియన్ల నుండి ఇప్పుడు 10 మిలియన్లకు చేరుకున్నాయి.
** గ్రామీణ గృహాలు(affordable housing) 2015లో 1 మిలియన్ వుంటే ఇప్పుడు 25 మిలియన్లకు పెరిగాయని నివేదిక పేర్కొంది.
** బ్యాంక్ అకౌంట్స్ గురించి మాట్లాడుతూ 2011లో 35% మందికి బ్యాంక్ అకౌంట్స్ వుంటే నేడు 80% మందికి.పైగా బ్యాంక్ అకౌంట్స్ చేరాయి అని నివేదిక పేర్కొంది.
….చాడా శాస్త్రి….