నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నుంచి మహారాష్ట్రలోని అకోలా మధ్య NH-53 సెక్షన్లో వరుసలో ఏకధాటిగా 75 కిలోమీటర్ల రోడ్డును ఐదు రోజుల్లో నిర్మించి కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది.
ఈమేరకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ను, రోడ్డు నిర్మాణ ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు.
#ConnectingIndia with Prosperity!
Celebrating the rich legacy of our nation with #AzadiKaAmrutMahotsav, under the leadership of Prime Minister Shri @narendramodi Ji @NHAI_Official successfully completed a Guinness World Record (@GWR)… pic.twitter.com/DFGGzfp7Pk
— Nitin Gadkari (@nitin_gadkari) June 7, 2022
జూన్ 3న ఉదయం 7.27 గంటలకు ప్రారంభించి జూన్ 7న సాయంత్రం 5:00 గంటలకు పూర్తి చేసిన ఈ పనిలో 800 మంది ఎన్హెచ్ఏఐ ఉద్యోగులు, ఇండిపెండెంట్ కన్సల్టెంట్ల బృందం సహా 720 మంది కార్మికులు పాల్గొన్నారని మంత్రి తెలిపారు. 105 గంటల 33 నిమిషాల్లో పని పూర్తయిందని గడ్కరీ తెలిపారు.
దేశంలోని ఖనిజ సంపన్న ప్రాంతం గుండా వెళుతున్న ఈ విభాగం కోల్కతా, రాయ్పూర్, నాగ్పూర్, అకోలా, ధులే మరియు సూరత్ వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది.
ఖతార్ లోని పబ్లిక్ వర్క్స్ అథారిటీ – ASHGHALఈ రికార్డును గతంలో 2019 ఫిబ్రవరి 27న సాధించింది. ఆ రహదారి అల్-ఖోర్ ఎక్స్ప్రెస్వేలో భాగం, ఆ పనిని పూర్తి చేయడానికి 10 రోజులు పట్టింది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించినందుకు NHAI బృందం, కన్సల్టెంట్లు, రాయితీదారు రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సహా జగదీష్ కదమ్లను గడ్కరీ అభినందించారు.