నూపుర్ శర్మ హత్యకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఆత్మాహుతి దాడికి సిద్ధమై రష్యా నుంచి భారత్ వస్తున్న 28ఏళ్ల ఐసిస్ ఉగ్రవాది అజమౌని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB)ఓ ప్రకటన విడుదల చేసింది.
రష్యా నుంచి భారత్ వచ్చేందుకు అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని భారత్ లో పలువురు సెలబ్రిటీలను హత్య చేయాలని ఐసిస్ అతన్ని ఆదేశించినట్టు గుర్తించారు. కొంతకాలం క్రితం అతన్ని రిక్రూట్ చేసుకుని సూసైండ్ బాంబర్ గా శిక్షణ ఇచ్చినట్టు తెలిపింది ఎఫ్ఎస్బీ.
అందులో భాగంగా …తన వ్యాఖ్యలు వివాదాస్పదమై బీజేపీనుంచి సస్పెన్షన్ కు గురైన నూపుర్ శర్మను ఆత్మాహుతి ద్వారా హతమార్చాలని అజమౌకిని ఆదేశించినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఆమెపై ప్రతీకారం తీర్చుకునే పథకంలో ఆ సంస్థ ఉందని తెలిపాయి. అందులో భాగంగా రష్యానుంచి అతన్ని ఢిల్లీకి పంపాలనుకున్నారు. అక్కడ అతనికి సాయం చేసేందుకు ఏర్పాట్లు సైతం చేశారు. ఈ విషయాలన్నీ రష్యా అధికారుల విచారణలో అంగీకరించాడు నిందితుడు. ఆన్లైన్ ద్వారా ఉగ్రవాదంవైపు ఆకర్షితుడైనట్టు…ఏ ఉగ్రనాయకుడినీ నేరుగా కలవలేదని చెప్పాడు ఆజమౌ.
https://twitter.com/Geeta_Mohan/status/1561642319769915392?s=20&t=tp_9NIUJUzUGKwTZyhr-Gw
రష్యా అదుపులో ఉన్న అజమౌ గురించి జూలై 27నే ఓ విదేశీ ఉగ్రవాద వ్యతిరేక సంస్థ భారత్కు సమాచారం అందించింది. కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లకు చెందిన ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు భారతదేశంలో ఉగ్రవాద దాడికి సిద్ధంగా ఉన్నారని, ఆ ఇద్దరిలో ఒకరు టర్కీలో ఉన్నాడని తెలిపింది. ఆ ఉగ్రవాదులు రష్యా మీదగా భారత్ కు వస్తారనీ సమాచారం ఇచ్చింది. ఈ వివరాలను భారత్ రష్యాకు తెలిపింది. దీంతో రష్యా ప్రభుత్వ ఆదేశంతో అలర్టైన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారులు అజమౌని అదుపులోకి తీసుకున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో నాటినుంచి భారత్ లో కూడా…ఐస్ నెట్వర్క్ ను విచ్ఛిన్నం చేసే పని మొదలైంది. అందులో భాగంగా ఏటీఎస్ దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించింది. అనేక చోట్ల సోదాలు చేసి అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.