భారతీయ జనతా పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ను హత్య చేసేందుకు పన్నిన కుట్రను పోలీసులు చేదించారు. రాజా సింగ్ తో పాటుగా హిందుత్వం అంశంలో బలమైన గళం వినిపిస్తున్న బిజెపి మాజీ అధికార ప్రతినిధి, నూపూర్ శర్మ సుదర్శన్ టీవీ చీఫ్ ఎడిటర్ సురేష్ చౌహంకే , మరికొందరు ఫైర్ బ్రాండ్ నేతల మీద హత్యకు పన్నాగం పన్నినట్లుగా తెలుస్తోంది. గుజరాత్ లోని సూరత్ నగరం లో జరిగిన సోదాల్లో ఒక మౌళ్వీ ని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ , నేపాల్ లో కొందరు నుంచి వస్తున్న ఆదేశాల ఆధారంగా ఈ కుట్ర అమలు చేస్తున్నట్లు గా సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ వెల్లడించారు. ఈ హత్యల కోసం కోటి రూపాయల సుపారిని ఆఫర్ చేసినట్లు వివరించారు పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా మారణాయుధాలు అందించేటట్లుగా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
నిందితుడిని అరెస్టు చేసి మరిన్ని వివరాలు రాబడుతున్నట్లు వివరించారు.
వాస్తవానికి హైదరాబాద్ పాతబస్తీలో ఉంటూ హిందుత్వ కోసం రాజాసింగ్ బలమైన పోరాటం చేస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గం వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. గతంలో కూడా ఆయన మీద హత్యాయత్నం కుట్రని పోలీసులు చేదించారు . దీంతో అదనపు భద్రత కల్పించడం జరిగింది. తాజాగా మరో కుట్ర బయటపడింది.