మోదీ వంటి వెన్నుముక గల వ్యక్తి ప్రధానిగా వుండడం దేశంలో ప్రతిపక్షాలకు, సెక్యులర్లకు, NGO లకు, ఆయుధ, ఫార్మా బ్రోకర్ల కే కాదు అమెరికా, చైనా, పాకిస్థాన్ లకు కూడా ఇబ్బందిగా వుంది.
వారి మాట వినే రాహుల్, మన్మోహన్ లేదా బలహీనమైన కిచిడి ప్రభుత్వం నడిపే ఎవరైనా భారత్ లో ప్రధానిగా వుండాలి అని వారి కోరిక.. ప్రాంతీయ పార్టీలకు కూడా బలహీన కేంద్ర ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలలో తమకు నచ్చినట్లు పాలన చేసుకుంటూ తమకు ఉన్న 10 లేదా 20 మంది ఎంపీలతో కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ తమ రాజకీయ కుటుంబ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వతంగా రాష్ట్రాలను తమ కుటుంబాల గుప్పెట్లో ఉంచుకోవచ్చు అనే కోరిక.
ఇప్పుడు మహారాష్ట్ర కిచిడీ ప్రభుత్వం చూస్తున్నాం కదా !
అధికారంలో ఉండడమే పరమావధి. అందుకోసం వేరే వేరే సిద్దాంతాలు ఉన్న సభ్యులందరూ ఎన్నికల ఫలితాల తరువాత ముఠాగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ ముఠాలోని సభ్యులు ఎవరూ ఎవరిని ఇబ్బంది పెట్టుకోరు. అలాగే మీడియాని మేపితే రాష్ట్రంలో ఎంత చెత్త పాలన వున్నా, ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా మీడియాలో ఎక్కువగా నెగటివ్ వార్తలు రాకుండా, పైగా ఆ ప్రభుత్వాన్ని పొగుడుతూ కూడా వారు వార్తలు రాస్తారు. అలాగే చెత్త పాలన, అవినీతి ఆరోణలపై ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా ఉండడానికి మన ఉదార మేధావి వర్గానికి భౌ..భౌ… అని అరవకుండా వారికి సెక్యులర్ బోమికలు వేసేస్తే చాలు. దేశానికి ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబై మాఫియా చేతుల్లోకి పోయి హత్యలు, ఆత్మ హత్యలు, రేప్స్, కిడ్నాప్స్, హాఫ్టా వసూళ్లు,హోమ్ మంత్రి, పోలీస్ చీఫ్ రాజీనామాల వరకు పోయి నాశనం అయిపోతున్నా “సెక్యులరిజం” ప్రమాదంలో పడకుండా పూర్తి మౌనం పాటిస్తారు. ఇంకా చూడండి బిజేపి కంటే కరుడు కట్టిన మత పార్టీ అని శివసేనను ఇన్నాళ్ళూ తిట్టి పోసిన ఈ సెక్యులర్ గ్యాంగ్ ఇప్పుడు శివసేన పై ఈగ కూడా వాలకుండా పదిలంగా కాపాడుకుంటున్నారు.
సరిగ్గా ఇటువంటి బలహీన కిచిడి ప్రభుత్వమే కేంద్రంలో రావాలి అని ఈ ఉదారవాద సెక్యులర్ మేధావులుకు, బ్రోకర్ పని చేసే జర్నలిస్టులకు, కమీషన్లకు కక్కుర్తి పడే ఆయుధ డీలర్లకు, ఏదో పేరుతో NGO లు ప్రారంభించి విదేశీ నిధులు మెక్కుతున్న NGO లకు, ప్రాంతీయ కుటుంబ పార్టీలకు చివరిగా భారత్ ని, భారతీయ వినియోగదారుల మార్కెట్ ని తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చూస్తున్న అమెరికా, చైనా మొదలగు దేశాలకు ఉండడం సహజమే.
బహుశా మోదీ నిజాయితీ, నిబద్ధత తెలిసే కాబోలు 2014లో మోదీ అధికారంలోకి రాకుండా మోదీకి వ్యతిరేకంగా ఈ ముఠాలోని సభ్యులు దేశ విదేశీ వార్తా మాధ్యమాలలో మోదీకి వ్యతరేకంగా విపరీతంగా వార్తలు, వ్యాసాలు ప్రచారం చేశారు. అయినా మోదీ గెలిచాడు. యుపిఎ మీద వ్యతిరేకతతో 2014లో ఏదో ఫ్లూక్ గా గెలిచాడు, అందుకే 2019లో ఎలాగైనా దింపెయ్యడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ సాధారణ ప్రజలు మోదీని మిగతా కుటుంబ రాజకీయ నాయకులతో పోల్చుకుని మోడీ వైపు మొగ్గు చూపడంతో ఈ ముఠా ఆశలను వమ్ము చేస్తూ 2019లో కూడా మోదీ సునాయాసంగా గెలిచాడు.
2019 ఎన్నికల తరువాత ఈ ముఠా పంథా మారింది. దేశంలో ఏదో కారణంతో అలజడులను సృష్టించడం జరుగుతోంది. ఢిల్లీ మత గొడవలు, రైతుల ధర్నా ఇలా 2019 నుండి ఆందోళనలు మొదలు పెట్టారు. దీనికి విదేశీ మీడియా బాహాటంగా నిర్లజ్జగా మద్దతు ఇస్తోంది. జాగ్రత్తగా చూస్తే 2019 ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ దీర్ఘ కాలిక విదేశీ ప్రయాణ సమయాల్లోనే అంటే అతను దేశంలో లేని సమయంలోనే యాదృచ్ఛికంగా పెద్ద పెద్ద అలజడులు జరిగాయి. 2020 లో ఢిల్లీ లో మత కలహాలు, 2021లో రైతుల ఆందోళన పేరుతో ఎర్ర కోటపై దాడి విధ్వంస రచన, 2022 లో పంజాబ్ లో మోదీపై హత్యా ప్రయత్నం. ఈ మూడు సమయాల్లోనూ రాహుల్ దేశంలో లేడు.
ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మోదీని ఎలాగైనా గద్దె దింపడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయి.
మోదీ ఉండడం వల్ల ముఖ్యంగా ఆయుధ లాబికి, ఫార్మా లాబీకి తట్టుకోలేని ఆర్థిక నష్టం జరుగుతోంది. కోవిడ్ వాక్సిన్ వ్యాపారం పై ఎన్నో అశలు పెట్టుకున్న అమెరికా ఫార్మా లాబీకి భారత్ లో స్వదేశీ వాక్సిన్ ప్రోత్సహించడంతో మోదీ పై బాగా కోపంగా ఉంది. భారత్ లో వాక్సిన్ వ్యాపారం సుమారు 80 వేల కోట్ల రూపాయలు అని అంచనా. దీనిలో కనీసం ఒక 10 శాతం వ్యాపారం కూడా అమెరికా ఫార్మా లాబీ సంపాదించలేకపోయింది. అదే ఏ కిచిడి ప్రధాని భారత్ లో ఉండుంటే వారి పని సులువుగా జరిగిపోయేది.
అందుకే దేశంలో ఉన్న ఈ సెక్యులర్ దొంగల ముఠా మాత్రమే కాదు విదేశాలు కూడా మోదీ 2024 ఎన్నికలలో అధికారంలోకి రాకుండా చూడడానికి ఇప్పటి నుండే చాలా ప్రణాళికలు రచిస్తున్నారు.
Courtesy :- Chada Shastry