కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రోగులు ఆక్సిజన్ దొరక్కా ఇబ్బందిపడుతున్న వేళ అత్యవసరాల కోసం ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని ప్రభుత్వాల సహకారంతో కేందద్రం నిర్వహించాలని… నాలుగు రోజుల్లో ఆ నిల్వలు ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్. రవీంద్రభట్ లతో కూడిన ధర్మాసనం వైద్యారోగ్య సిబ్బంది ప్రయోజనాల కోసం కూడా పలు సూచనలు, సలహాలు ఇచ్చింది. సుమోటాగా విచారణ చేపట్టిన సుప్రీం అందుకు సంబంధించిన లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది.