కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా.
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎన్నికలు జరగనున్న వేళ.. కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పీసీ చాకో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపినట్లు పీసీ చాకో తెలిపారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయని.. దీంతో నాయకత్వ లేమి స్పష్టంగా కొట్టొస్తుందంని.. పార్టీలో కొనసాగే పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఏడాదికి పైగా పార్టీకి అధ్యక్షుడు లేడని.. కొత్త అధ్యక్షుడిని నియమించే ప్రయత్నాలు కూడా చేయడం లేదని.. ప్రస్తుతం కేరళలో కాంగ్రెస్ పార్టీ తీరు తలలేని పార్టీగా ఉందని వ్యాఖ్యానించారు.
కేరళలో కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా పోయిందని.. పార్టీ పరిస్థితులను అధిష్టానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యానని.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్ధుల ఎంపిక విషయంలో కనీసం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీతో కూడా చర్చించలేదన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. పీసీ చాకో నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లయ్యింది.
https://twitter.com/ANI/status/1369571618872168448