ఆజాద్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. మోదీ గురించి నిజాలు చెబితే ఇలా చేస్తారా..?
https://twitter.com/ANI/status/1366642740373512193
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ్యులు గులాం నబీ ఆజాద్పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఆయన రాజ్యసభ పదవి నుంచి రిటైర్ అయ్యారు. తాజాగా ఆయన ప్రధాని మోదీ గురించి ప్రశంసలు చేశారు. మోదీ ఏ విషయాన్నైనా భయపడకుండా చెప్తారని.. తామిద్దరం రాజకీయంగా వేరే పార్టీలకు చెందిన వారమని.. కానీ ఆయన వ్యక్తిత్వం ఎంతో గొప్పదంటూ వ్యాఖ్యానించారు. చిన్నతనంలో ఆయన పడ్డ కష్టాలను చెప్పుకోవడంలో సిగ్గుపడరని.. తాను ఓ చాయ్వాలా అన్న విషయాన్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటూ తన చిన్ననాటి కష్టాలను చెప్పుకోవడం అందరికీ సాధ్యమయ్యేపని కాదని ఆజాద్ వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి నేతలంతా కశ్మీర్లో గులాం నబీ ఆజాద్కు సన్మానం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆజాద్ బీజేపీతో దోస్తీ కట్టారంటూ ఆరోపిస్తూ.. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులను అనుభవించిన ఆజాద్.. ఇప్పుడు పార్టీకి మద్దతు పలకడం లేదని.. డీడీసీ ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఆజాద్ కశ్మీర్ రాలేదని వారు ఆరోపించారు.