కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కరోనా సోకింది. కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయిందని..ఆమె హోం ఐసోలేషన్లోకి వెళ్లినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్లో వెల్లడించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియాకు, రాహుల్ కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసింది. ఈనెల 8న గాంధీలిద్దరూ ఈడీ విచారణకు హాజరుకావల్సి ఉంది. ఆరురోజుల ముందుగా ఆమెకు కరోనా సోకింది.
ఇటీవల నాయకులతో సోనియా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని… పరీక్షచేయగా ఆమెకు కోవిడ్ అని తేలిందని పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా అన్నారు. బుధవారం సాయంత్రఆమెకు స్వల్పంగా జ్వరం వచ్చింది. దీంతో పరీక్ష చేయించాల్సివచ్చిందని తెలిపారు.
రెండు రోజుల క్రితమే ఈడీ సోనియాకు, రాహుల్ కు సమన్లు పంపింది. అసలైతే జూన్ 2 న హాజరుకావాల్సి ఉండగా…రాహుల్ గాంధీ విదేశంలో ఉన్నందున వాయిదా వేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఇద్దరి వాంగ్మూలాలను నమోదు చేయనుంది.
నేషనల్ హెరాల్డ్ స్కాం దేశ చరిత్రలో కీలకమైన స్కామని చెప్పవచ్చు. ఎందుకంటే ఏకంగా గాంధీలు నిందితులుగా ఉన్నారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కొనుగోలులో రాహుల్ గాంధీ,సోనియాగాంధీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, మోతీలాల్ వోరా, సామ్ పిత్రోడా భారీమోసానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను స్వల్ప మొత్తానికి బదిలీ చేసినట్టు తేలింది. ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు 2015 డిసెంబర్లో షరతులు లేకుండా బెయిల్ వచ్చింది. అయితే 2015లోనే కేసు క్లోజ్ చేసినా…. బీజేపీ మళ్లీ కావాలనే దర్యాప్తుసంస్థలతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.