ఎన్నికలవేళ నాయకుల కప్పదాట్లు మొదలయ్యాయి. యూపీలో జంప్ జిలానీలు ఎక్కువ కాగా…
పంజాబ్ లోనూ నాయకుల రాజీనామాలు, చేరికలు మొదలయ్యాయి. మోగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ హర్ జోత్ కమల్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మీనాక్షీలేఖి సహా పలువురు నేతల సమక్షంలో చండీగఢ్ లోని పార్టీ ఆఫీసులో కాషాయకండువా కప్పుకున్నారు. నటుడు సోనూసూద్ సోదరి మాళవికాసూద్ కు మోగా నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన హస్తం పార్డీకి గుడ్ బై చెప్పేశారు.

Harjot Kamal(Left), Malavika Sood(Right)