కర్నాటక హిజబ్ కధ కేవలం కర్నాటకకు మాత్రమే పరిమితం కాదు..
ఇది యావత్ భారత్ మీదా ప్రభావం చూపే అతి పెద్ద కుట్రపూరిత చర్య..
ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 1 న హిజబ్ దినంగా పాటించే సాఫ్ట్ జీహాదీ కుట్రకు నజమా ఖాన్ అనే మహిళా డాక్టర్ దీన్ని తన ఇస్లామిక్ నెట్ వర్క్ ద్వారా నాన్-ఇస్లామిక్ దేశాల్లో ప్రారంభం చేశారు..
ఈ హిజబ్ లేదా తల మీద కప్పుకునే వస్త్రం, ఒళ్ళంతా కప్పుకునే బుర్ఖా వేసుకోవడం అనేది నాన్ ముస్లిం మహిళలకు పరిచయం చేయడం..నాన్ ముస్లిం మహిళల చేత కనీసం ఒక్కరోజన్నా హిజబ్, బుర్ఖా ను ధరింపచేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం..
ఉడిపి, మణిపాల్.. లాంటి కేరళ, కర్నాటక సరిహద్దు ప్రాంతాల్లో ఈ హిజబ్, బుర్కా ద్వారా హిందూ మహిళలకు దగ్గర కావడానికి జమాతే ఇస్లాం సహా SDPI ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నాయి.. దీనిలో భాగంగా గత ఏడాదీ ఫిబ్రవరి 1న ఉడుపి, మణిపాల్ లాంటి చోట్ల హిజబ్ డే నిర్వహించారు.. చాలామంది హిందూ బాలికలు హిజబ్, బుర్ఖా దరించడానికి తిరస్కరించారు.. ఈ వివాదం నాటి నుంచీ కొనసాగుతూ వస్తుంది..ఈ నేపధ్యంలో డిసెంబర్ 13 నుంచీ ఉడిపిలోని స్థానిక PU కాలేజీ విద్యార్తినుల మధ్య ఈ సంఘటన మీద చర్చ జరుగుతుంది.. ఏనాడూ బుర్ఖా ధరించని ఆ కాలేజీ కి చెందిన 6 ముస్లిం విద్యార్ధినులు పూర్తి బురఖాతో కాలేజీకి రావడం మొదలుపెట్టారు.. వారికి కాలేజీ ప్రిన్సిపాల్ మొదటి రోజే చెప్పారు కాలేజీ యూనిఫార్మ్ కాకుండా వేరే ఏ డ్రెస్ నూ అనుమతించబడదు అని..
ఈ కుట్ర వెనుక ఉన్న స్థానిక జమాతే నాయకులు ఈ విషయాన్ని మరింతగా రెచ్చగొట్టారు..
డిసెంబర్ 31, 2021 న ఆ ఆరుగురు ముస్లిం విద్యార్ధినులు కాలేజీ గేట్ వద్ద ధర్నాకు దిగారు..
తీవ్రతను గమనించిన ప్రిన్సిపాల్ వెంటనే కాలేజీ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు..దాంట్లో పాల్గొన్న పేరెంట్స్ సహా స్థానిక ప్రజాప్రతినిధులు కాలేజీ నియమనిబంధనల ప్రకారమే నడుచుకోవాలని యూనిఫార్మ్ మాత్రమే అనుమతించాలని సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై ఆ ఆరుగురి విద్యార్ధినుల తల్లితండ్రులకు తెలియచేసారు దానికి వాళ్ళు సమ్మతించారు.
ఇంకా విద్యాసంవత్సరం కేవలం 2 నెలలే ఉన్నందున క్లాసుల సక్రమ నిర్వహణకు సహకరించమని విద్యార్ధులకూ.. తల్లితండ్రులకూ డెవలమెంట్ కమిటీ విజ్ణప్తి చేసింది..
జమాతే మాత్రం ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేసే ఉద్దేశ్యంతో దీన్ని కర్నాటకలోని ఇతర ప్రాంతాల్లోకి కూడా విస్తరించింది. అక్కడ కూడా దీన్ని వివాదంగా మలచింది. ఆ ఆరుగురు విద్యార్ధినులు కర్నాటక హైకోర్టుకు వెళ్లారు గంటకు లక్షల రూపాయలు ఫీజుగా తీసుకునే లాయర్లను అడ్వకేట్లుగా పెట్టుకున్నారు. ఆ విద్యార్దినుల కుటుంబాలు దిగువ మధ్య తరగతికి చెందినవి కానీ ఆశ్చర్యంగా లక్షల ఫీజు చెల్లించి మరీ కోర్టులో కేసులు వేశారంటే దీని వెనుక ఉన్న కుట్ర అర్ధం చేసుకోవడం పెద్ద విషయం కాదు.
జమాత్ హృదయాన్ని అర్ధం చేసుకున్న తుకడే తుకడే గ్యాంగ్ లు కాంగ్రేస్, లిబరల్ కమ్మీగాళ్ళు తమతమ మీడియా సాయంతో మరింత ఆజ్యం పోశారు..
ఈ రెచ్చగొట్టే చర్యలకు ప్రతిగా ఏబీవీపీ తదితర సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకూ స్వచ్ఛందంగా చాలా మంది హిందూ విద్యార్దులు మెడలో కాషాయ కండువాలు, నీలి కండువాలు వేసుకురావడం మొదలు పెట్టారు..
చర్యకు ప్రతిచర్య సహజం..
నిన్న జరిగిన నాటకీయ పరిణామాలను ఈ లిబరల్ బట్టకాయిల గ్యాంగ్ లు సమర్దింపు ఊహించినదే..
ముందుగానే కెమెరాను ఎరేంజ్ చేసుకొని ఎక్కడైతే ఉద్యమం జరుగుతున్నదో అక్కడికి వాహనం వేగంగా నడుపుతూ వచ్చి వాళ్ళను రెచ్చగొట్టే విధంగా అల్లాహో అక్బర్ నినాదాలు చేస్తే అక్కడున్న వాళ్ళు ఊరుకుంటారా?? వాళ్ళూ ప్రతిగా జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు..
లిబరల్స్ దృష్టిలో అల్లాహో అక్బర్ సెక్యులర్.. జైశ్రీరాం ఉగ్రవాదం..
ఇదే సంఘటనను వ్యతిరేకంగా ఎందుకు ఆలోచించరు??
అక్కడున్న వాళ్ళు జైశ్రీరాం నినాదాలు ఇచ్చుకుంటుంటే ఆ అమ్మాయి అల్లాహో అక్బర్ ఉగ్రవాద నినాదం ఇచ్చింది అని హిందువులు అంటారా? ఇప్పుడున్న పరిస్తితుల్లో మీరు అనుకునేట్టు చేస్తున్నారు..
2019 లోనే కేరళ లోని ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ తమ 150 విద్యా సంస్థల్లో బుర్ఖా మాత్రమే కాదు తలమీద కప్పుకునే హిజబ్ ను కూడా నిషేదించింది. అప్పుడు ఈ లిబరల్స్ నోళ్ళు ఏమయ్యాయి?
కేవలం మోదీజీ వ్యతిరేక భావజాలంతో కర్నాటకలో బిజేపి ప్రభుత్వం ఉన్నదని ఈ విషయం మీద ఇంత రచ్చ చేస్తున్నారా?
ఒక పక్క కర్నాటక ప్రభుత్వం ‘కర్నాటక విద్యా చట్టం 2013, 2018 ప్రకారం ప్రతి విద్యార్ధి, విధ్యార్దిని స్కూల్ లేదా కాలేజీ యూనిఫార్మ్ ‘ మాత్రమే ధరించాలని స్పష్టం చేసింది..
ఈ విషయం మొత్తం కూడా కర్నాటక మీద తాలిబాన్ మనఃస్త్వత్వ జీహదీ గ్యాంగ్ ల పట్టు కోసం మాత్రమే జరుగుతున్నది.
బిజేపి ప్రభుత్వాలను ఇరుకున పెట్టడానికి ఎంత నీచానికైనా దిగజారే కాంగ్రేస్ నాయకత్వంలోని తుకడే తుకడే గ్యాంగ్ లు దీన్ని అందిపుచ్చుకొని మరింత జ్వలించేట్టు చేస్తున్నారు.
మోదీజీ మీదా..బిజేపి మీదా ఉన్న ద్వేషంతో ఇక్కడి కుటుంబ పార్టీల బానిసలు కూడా సమస్య తీవ్రతను గుర్తించకుండా మతోన్మాదులు విసిరిన వలలో తెలిసి కూడా చిక్కుకుంటున్నారు.
గుర్తు పెట్టుకోండి మీరు ఎంతగా ప్రతిఘటిస్తే అంతగా హిందువులు ఏకం అవుతారు.
మీరు గొప్పగా భావిస్తున్న ఆ లిబరలిజం ఆఫ్ఘన్ లోలాగా ముందుగా కాటువేసేది మిమ్మల్నే.
ఇస్లాం పుట్టిన సౌదీ అరేబియా లో మతోన్మాద భావజాలం నుంచీ బయటకు వస్తున్నారు. మహిళలకు కావలసిన స్వేచ్చా వాయువులను అందిస్తున్నారు. హిజబ్ నుంచీ వాళ్ళకు విముక్తిని కలుగచేస్తున్నారు. ఆశ్చర్యంగా ఇక్కడ సౌదీలో ఏవైతే రద్దుచేస్తున్నారో అవే కావాలని ధర్నాలు చేయడం విచిత్రం.
అవును ఒప్పుకుంటాం హిజాబ్ మీ జన్మహక్కు కానీ అది మీ వ్యక్తిగతం మాత్రమే. సామూహిక స్థలాలు అలాగే యూనిఫార్మ్ నిబంధనలతో నడిచే విద్యాసంస్థల నియమనిబంధనలు మీరు తప్పనిసరిగా పాటించాల్సిందే. మీరే కాదు ఏ మతానికి చెందినవారైనా సరే ఆ నియమాలు పాటించాల్సిందే దానికి ఎవరికీ మినహాయింపు లేదు..
Courtesy :- Srinivasa Rao Avvaru