కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ దేశవ్యాప్తంగా జరుపుకుంది. గాంధీభవన్లో పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశప్రజలు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్.. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అవతరించిందన్నారు. మహాత్మాగాంధీ మరణించినా..ఆయన ఆశయసాధనలో స్ఫూర్తిమంతంగా పార్టీ పనిచేస్తోందని చెప్పుకొచ్చారు.ప్రపంచ దేశాలముందు శక్తిమంతమైన దేశంగా భారత్ ను నిలబెట్టడంలో నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని రేవంత్ అన్నారు. పలువురు పార్టీ సీనియర్లు ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు.అటు ఏపీలో కూడా పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో జిల్లా, మండలాలు, గ్రామస్థాయిలో నాయకులు ఉత్సవాలు చేసుకున్నారు.