ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. బీజాపూర్ జిల్లాలోని తర్రం అటవీ ప్రాంతంలో నక్సలైట్లకు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది వీరమరణం పొందారు. మరో పది మందికి పైగా జవాన్లు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ డీజీపీ డీఎం అవస్తి తెలిపారు.
కాగా, ఈ మధ్య జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో ఇదే పెద్దది కావడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఐదుగురు జవాన్లు వీరమరణం పొందడంతో పాటు.. పది మంది గాయపడటంతో అధికారులు ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. డీజీపీ డీఎం అవస్తి, యాంటి నక్సల్స్ ఆపరేషన్స్ స్పెషల్ డీజీ అశోక్ జునేజాతో పాటు మరికొందరు ఉన్నతాధికారులతో రాయ్పూర్లో అత్యవసర మీటింగ్ కొనసాగుతోంది.
https://twitter.com/ANI/status/1378286671792250880
https://twitter.com/ANI/status/1378311502176735233