మైనార్టీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో రాజకీయం చేస్తోంది. ఇందులో భాగంగా అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. న్యాయపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా వాటికి పక్కదారులు ఎంచుకొని మరీ ముందుకు వెళుతోంది . తాజాగా కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.కర్ణాటకలో కొంత కాలంగా ముస్లిం రిజర్వేషన్ల మీద వాదనలు నడుస్తున్నాయి
రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతి (OBC)లో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమీషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. కర్ణాటక ప్రభుత్వ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి.
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, కర్ణాటక ప్రభుత్వ డేటా ప్రకారం, కర్ణాటకలోని ముస్లింలలోని అన్ని కులాలు, వర్గాల వారు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోసం OBCల జాబితాలో చేర్చడం జరిగింది. దీంతో ఇక నుంచి కేటగిరీ II-B కింద, కర్ణాటక రాష్ట్రంలోని ముస్లింలందరూ OBCలుగా పరిగణించడం జరుగుతుంది. కేటగిరీ-1లో 17 ముస్లిం సంఘాలను ఓబీసీగా, కేటగిరీ-2ఏలో 19 ముస్లిం వర్గాలను ఓబీసీగా పరిగణించినట్లు కమిషన్ పేర్కొంది.
NCBC ప్రెసిడెంట్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ ప్రకారం, “కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం కర్ణాటకలోని ముస్లింలందరూ OBCల రాష్ట్ర జాబితాలో చేర్చింది. కర్ణాటక ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జాతీయ వెనుకబడిన తరగతుల చట్టం కింద ఒక నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రంలో ముస్లిం జనాభా 12.32 శాతంగా పేర్కొంది.
ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని బయట పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వేరే ప్రయోజనం ఆశిస్తోంది .ముస్లింల ఓట్లను గంపగుత్తగా కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.