తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది.
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ వివాదం రేపారు. న్యాయ నిపుణుడు అయినా సింగ్వీ ఇప్పుడు పెద్ద కాంట్రావెర్సికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.
వివాదంలో చిక్కుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా ప్రసిద్ధి చెందిన సింగ్వీ.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు. రాజ్యసభలో ఆయన సీటు కింద గుట్టలకొద్దీ డబ్బు దొరకడం కలకలం రేపుతోంది.
గట్టి భద్రత ఉన్న పార్లమెంటులో ఇది చోటుచేసుకుంది.
రాజ్యసభ సిబ్బంది సాధారణ తనిఖీల్లో సీటు నంబర్ 222 కింద కరెన్సీ నోట్ల గుట్ట కనిపించిందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ సభకు తెలియజేశారు. గురువారం సభ వాయిదా పడిన తర్వాత సాధారణ తనిఖీలు చేస్తున్నప్పుడు ఇది బయటపడిందని వివరించారు. ప్రస్తుతం తెలంగాణ నుండి ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ సీటు నుండి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారని ఆయన వివరించారు. ఈ విషయాన్ని తక్షణమే తన దృష్టికి తీసుకొచ్చారని, ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఇటువంటి వివాదం కోర్టులో తేలడం కష్టమే కావచ్చు కానీ,, కాంగ్రెస్ పార్టీ లంచగొండి అన్న ముద్ర మాత్రం పడిపోతుంది..