కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మైనార్టీ రాజకీయాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే వారికే పెద్ద పీట వేస్తున్నారు. అది గమనించి, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు, మజ్లిస్ పార్టీ తో ప్రేమ గీతాలు పాడుతున్నారు.
….
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ మార్కు రాజకీయానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ఎన్నిక లో మజ్జిస్ పార్టీ, బీజేపీ మాత్రమే తలపడ్డాయి. మజ్జిస్ పార్టీ అభ్యర్థి మిరాజ్ ఈ ఎన్నికల్లో 38 ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నిక కోసం మజ్జిస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ కష్టపడింది. హైదరాబాద్ ను గంప గుత్తగా మజ్లిస్ పార్టీకి అప్పగించేందుకు సర్వ శక్తులూ ఒడ్డింది. సాధారణంగా అధికార పార్టీ కి ఉప ఎన్నికల్లో గెలుపు అన్నది నల్లేరు మీద నడకగా ఉంటుంది. అయినప్పటికీ , ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీకి దూరంగా నిలిచింది. తమ పార్టీ ఓట్లన్నీ దగ్గరుండి మజ్లిస్ కు వేయించి, హైదరాబాద్ ను మజ్లిస్ కు అప్పగించింది.
…
గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే పథకాన్ని అమలు చేసింది. సలాఉద్దీన్ ఒవైసీ హయంలో హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో పాతబస్తీ తో పాటు చేవెళ్ల వంటి గ్రామీణ నియోజక వర్గాలు ఉండేవి. అప్పట్లో ఎంపీ సీటుని గెలిచేందుకు పెద్ద ఒవైసీ చాలా కష్ట పడాల్సి వచ్చేది. కేవలం పాత బస్తీ ఓట్లను నమ్ముకోకుండా, కొంత మేర మిగిలిన వర్గాలను బ్యాలెన్స్ చేసుకొనేవారు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో భయంకరమైన కుట్ర జరిగింది. హైదరాబాద్ లోని పాత బస్తీ, చుట్టు పక్కల ప్రాంతాలకు ఏడు అసెంబ్లీ సీట్లు కేటాయించారు. దీంతో హైదరాబాద్ ఎంపీ సీటు పూర్తిగా పాత బస్తీ ద్వారా గెలిచేట్లు డిజైన్ చేశారు. దీంతో మజ్లిస్ పార్టీ పూర్తిగా పాకిస్తాన్ అజెండా ను బహిరంగంగా అమలు చేస్తోంది.
…..
ఇక్కడే మరో విషయం గుర్తు చేసుకోవాలి. కేసీయార్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. గులాబీ పార్టీ, మజ్లిస్ పార్టీ బలంగా ప్రేమించుకొనేవి. అప్పట్లో కాంగ్రెస్ ను కేసీయార్ ముప్పు తిప్పలు పెడుతుంటే.. ఒవైసీ బ్రదర్స్ బాగా ఎంజాయ్ చేసేవారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ నేతలను ఫుట్ బాల్ ఆడుతుంటే.. మజ్లిస్ ఎప్పుడూ అడ్డుపడలేదు. బీ ఆర్ ఎస్ పార్టీకి అన్ని రకాలుగా సహకరించింది. కాంగ్రెస్ ను ఛీ కొట్టి చీదరించుకొంది అన్నది బహిరంగ రహస్యం.
….
అవన్నీ మరిచిపోయి, కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ సేవలో తరించిపోతోంది. సొంత పార్టీ గెలిచేందుకు అవకాశం ఉన్నప్పటికీ, మజ్లిస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొంది. మరో వైపు, హైదరాబాద్ లో 50 మందికి పైగా పాకిస్థానీ ముష్కరులు దాగి ఉన్నారని డీజీపీ స్వయంగా వెల్లడించారు. ఈ ద్రోహులంతా పాత బస్తీలోనే దాగి ఉంటారు అనేది బహిరంగ రహస్యం. పాత బస్తీ లో విదేశీ ముష్కరులు, రోహింగ్యాలకు ఆశ్రయం ఇస్తున్న ఒవైసీ బ్రదర్స్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ అంట కాగుతోంది. తాజాగా కాశ్మీర్ లో అంతటి హింసాకాండ జరిగితే.. అటువంటి ముష్కరులను వెనకేసుకొని వచ్చే ఒవైసీ బ్రదర్స్ తో కలిసి… శాంతి ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించి.. ఆ వెలుగులో అసలు రంగు బయట పెట్టుకున్నారు.
…
మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం దగ్గర మంచిమార్కులే పడుతున్నాయి. మజ్లిస్ తో ప్రేమ కొనసాగించినంత కాలం.. ఇక్కడ నేతలకు తిరుగు ఉండదు. అదీ కాంగ్రెస్ మార్కు రాజకీయం.