కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ కరణ్ సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జమ్మూకశ్మీర్ కు సంబంధించి క్లిష్టమైన అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ‘పార్టీ వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉందని జమ్ముకశ్మీర్ ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను గ్రహించడంలో విఫలమైంది’ అంటూ సోనియాగాంధీకి లేఖలో పేర్కొన్నారు.
జమ్ముకాశ్మీర్ కి సంబంధించిన క్లిష్టమైన సమస్యలపై నా వైఖరి, కాంగ్రెస్ వైఖరికి పొంతనే లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉందని తరువాత ట్వీట్ చేశారు. విక్రమాదిత్య సింగ్ జమ్ముకశ్మీర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మాజీ సభ్యుడు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం.
https://twitter.com/vikramaditya_JK/status/1506217893175783428?s=20&t=RbPQwM7riL-5yYzGQaqTeQ