అయోధ్య మందిరానికి నిధి సమర్పణ ఇవ్వనంటున్న కాంగ్రెస్ నేత..! ఆయన మాజీ సీఎం కూడా..
అయోధ్యలో నిర్మాణమవుతున్న శ్రీ రామ మందిరం గురించి తెలిసిందే. ఈ నిర్మాణం కోసం శ్రీ రామ జన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు దేశ వ్యాప్తంగా నిధిని సేకరిస్తోంది. మకర సంక్రాంతి నాడు ప్రారంభమైన ఈ నిధి సమర్పణ అభియాన్ ఫిబ్రవరి 27వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఈ అభియాన్ దేశ వ్యాప్తంగా చురుగ్గా కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రామ మందిర నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. ఆ తర్వాత క్షమాపణలు కోరారు. తాజాగా కర్ణాటక మాజీ సీఎం సిద్దిరామయ్య కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మందిర నిర్మాణానికి తాను విరాళం ఇవ్వబోనన్నారు. అంతటితో ఆగకుండా.. అయోధ్యలో నిర్మాణమయ్యే మందిరం వివాదాస్పద రామ మందిరమని.. అందుకు తాను విరాళం ఇవ్వనంటూ చెప్పుకొచ్చారు. వేరే ప్రాంతంలో రామ మందిరానికి మాత్రం
విరాళం ఇస్తానన్నారు.