ఆదివారం లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసలో ఓ జర్నలిస్టు చనిపోయాడు. బీపీ న్యూస్ రిపోర్టర్ రామన్ కశ్యప్ చనిపోయినట్టు మీడియా హౌస్ ఎడిటర్ పంకజ్ ట్వీట్ చేశాడు. పోస్టుమార్టం సందర్భంగా రామన్ కుటుంబసభ్యులు అతని డెడ్ బాడీని గుర్తించారు. యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కాన్వాయ్ పై కొందరు నిరసనకారులు దాడి చేయడం… తరువాతి హింసలో మొత్తం తొమ్మిదిమంది చనిపోయారు. ఘటనపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఘటన దురదృష్టకరమని …అయితే దీన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నారని మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముందు ఎన్నికలు ఉన్నందున కాంగ్రెస్ వాళ్లు దీన్ని రాజకీయం చేస్తున్నాయని విపక్షాల తీరు సిగ్గుచేటని అన్నారు. 2022 ఎన్నికల్లో లబ్దికోసం ప్రియాంకవాద్రా శవరాజకీయం మొదలుపెట్టిందని మండిపడ్డారు.

File photo