పంజాబ్ కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. ఇక సాక్షాత్తూ సీఎం అభ్యర్థి చన్నీ సహా పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సైతం ఓడిపోయారు.రాష్ట్రంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధూ ప్రకటించారు. 117 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పంజాబ్లో గత ఎన్నికల్లో 77 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. ఈసారి కనీసం 20 కూడా గెలుచుకోలేకపోతోంది. చన్నీ అయితే పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు.