గోరఖ్ పూర్ లోని ప్రసిద్ధ ప్రచురణ సంస్థ గీతాప్రెస్ కు 2021 సంవత్సరానికి గాను గాంధీ శాంతి బహుమతి లభించింది. అహింస, ఇతర గాంధేయ విధానాలతో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైన మార్పునకు చేసిన కృషికి గుర్తింపుగా ఎంపిక చేసినట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గల జ్యూరీ సంప్రదింపుల తర్వాత గీతా ప్రెస్ ను ఈ అవార్డు కోసం ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు తెలిపింది.
గాందీ ఆదర్శజీవితానికి నివాళిగా 1995నుంచి కేంద్రం ఈ పురస్కారం ఇస్తోంది. పురస్కారం కింద కోటి రూపాయన నగదు ఇస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గల జ్యూరీ సంప్రదింపుల తర్వాత గీతా ప్రెస్ ను ఈ అవార్డు కోసం ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది.
https://twitter.com/narendramodi/status/1670419759366828033?s=20
‘‘2021 సంవత్సరానికి గాంధీ శాంతి పురస్కారానికి ఎంపికైన గోరఖ్ పూర్ గీతా ప్రెస్ కు అభినందనలు. ప్రజల్లో సాంస్కృతిక, సామాజిక పరివర్తన కోసం 100 ఏళ్ల పాటు చేసిన సేవలు నిజంగా ప్రశంసనీయం’’ అని మోదీ ట్వీట్ చేశారు. అయితే గాంధీ శాంతి బహుమతికి గీతా ప్రెస్ ను ఎంపిక చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.
గీతాప్రెస్ ను ఎంపిక చేసి అవార్డును అవహేళన చేశారని జైరామ్ రమేశ్ అన్నారు.
https://twitter.com/Jairam_Ramesh/status/1670471571041927168?s=20