కాంగ్రెస్, డీఎంకే పార్టీలకు మహిళలంటే అసలు గౌరవమే ఉండదని.. వారి భద్రత గురించి ఆలోచించే మనస్తత్వం కూడా ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు.. మధురైలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడతూ.. ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల శక్తి గురించి మధురై ఎన్నో పాటలు చెప్పిందన్నారు. స్త్రీలను ఎలా గౌరవించాలో.. ఏవిధంగా ఆరాధించాలో మధురైలో చూడవచ్చన్నారు. డీఎంకే నేతలు పలుమార్లు స్త్రీలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తుంటారని ఆరోపించారు.