
మొదటి నెహ్రూ మంత్రివర్గంలో న్యాయ శాఖ మంత్రిగా చేసిన అంబేద్కర్ సెప్టెంబరు 1951లో, హిందూ కోడ్ బిల్లుపై ప్రతిష్టంభన కారణంగా మంత్రివర్గం నుండి రాజీనామా చేశాడు . తదనంతరం, అతను మరియు అతని భార్య సవిత సిరోహి 26 అలీపూర్ రోడ్ బంగ్లాలోకి అద్దెకు దిగారు.
అంబేద్కర్ యొక్క సహాయకుడు నానక్ చంద్ రట్టు ప్రతిరోజూ సాయంత్రం 26 అలీపూర్ రోడ్ని సందర్శించి, 1951-1956 మధ్యకాలంలో అతని అనేక రచనలను టైప్ చేశాడు. అంబేద్కర్ 6 డిసెంబర్ 1956న బంగ్లాలో మరణించిన తరువాత సవితా అంబేద్కర్ అక్కడ నివసించడం కొనసాగించారు. 1966లో, మదన్ లాల్ జైన్ అనే ఆయన ఆ బంగ్లాను కొనుగోలు చేశాడు. అయినా, అతను సవితా అంబేద్కర్కు రెండు గదులను ఉండడానికి అనుమతించాడు.
1967లో, జైన్ సవితా అంబేద్కర్ను తొలగించే ప్రక్రియను ప్రారంభించాడు. అదనపు రెంట్ కంట్రోలర్ ఆమెకు జనవరి 17న తొలగింపు నోటీసును అందించాడు. ఆమె ఖాళీ చేయక పోవడంతో కొన్ని రోజుల తర్వాత, ఆమె వేరే ఊరు వెళ్ళినపుడు ఆ గదులు స్వాధీనం చేసుకుని భవనాన్ని కూల్చేశారు.
ఆ తరువాత దానిని జిందాల్ కుటుంబం కొనుక్కుని కొత్త నివాసాన్ని నిర్మించారు. దానిని అనధికారికంగా “జిందాల్ కోఠి” అని పిలుస్తారు.
1991లో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కరిస్టులు స్మారక చిహ్నం నిర్మించేందుకు ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక దశాబ్దం తర్వాత, 2003లో, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని NDA ప్రభుత్వం స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి స్థలాన్ని కొనుగోలు చేసి, ప్రధాని వాజ్పేయి “బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పరినిర్వాన్ స్థల్” కి పునాది వేశారు , స్మారక చిహ్నం మరియు మ్యూజియం నిర్మించాలని యోచించారు. దాని కోసం ₹100 కోట్లు కేటాయించారు. భవన నిర్మాణం మొదలు అయింది.
అయితే, 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో వాజ్పేయి ప్రాజెక్టు ఆగిపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం వాజపేయి కేటాయించిన ₹100కోట్లు వేరే పనులకు ఉపయోగించేసి ఈ ప్రాజెక్ట్ మూలన పడేసింది. 2007లో, అంబేద్కరిస్టులు ఈ స్థలాన్ని మెరుగ్గా నిర్వహించాలని కోరడంతో ప్రభుత్వం బంగ్లా శుభ్రం చేయించి బంగ్లాకు సున్నాలు వేసింది. 2011లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కొత్త స్మారక చిహ్నంపై ఉన్నత స్థాయి కమిటీ వేసారు. ఆ కమిటీ 2012లో తన నివేదికను సమర్పించగా 2013లో పనిని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కు అప్పగించారు. కానీ అసలు ఏ పని ఏదీ ప్రారంభించబడలేదు. చరిత్రలో కాంగ్రెస్ తో అంబేద్కర్ గల వివాదాస్పద వ్యవహార శైలి కారణంగా ఈ స్మారకాన్ని UPA ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అంబేద్కరిస్టులు ఆరోపించారు.
2014లో భాజపా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆ స్థలంలో కొత్త స్మారకాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జూలై 2015లో, కొత్త స్మారక చిహ్నం నిర్మాణానికి ప్రభుత్వం ₹ 99.64 కోట్లు మంజూరు చేసింది.
2015లో అప్పడు UPA నిర్వహిస్తున్న స్మారక చిహ్నాన్ని సందర్శించిన జర్నలిస్ట్ మయాంక్ ఆస్టెన్ సూఫీ, దానిని “ఎడారి”గా అభివర్ణించారు. లైబ్రరీ ఉంది..కనీసం ఏసీ సదుపాయం లేదు. పుస్తకాలు చదవడానికి వీలు లేకుండా అన్ని గాజు తలుపుల బీరువాలలో భద్రపర్చేసారు, ఒక్క ట్యూబ్ లైట్ మాత్రమే ఉండేది అని స్మారక ఫౌండేషన్ సంపాదకుడు సుధీర్ హిల్సాయన్ అని అభివర్ణించారు.
మోడీ 21 మార్చి 2016న ప్రస్తుత స్మారకానికి శంకుస్థాపన చేశారు. 2003లో వాజ్పేయి రూపొందించిన ప్రాజెక్టును 13 ఏప్రిల్ 2018న అంబేద్కర్ జయంతి సందర్భంగా మోదీ స్మారకాన్ని పూర్తి చేయించి ప్రారంభించారు.

The Prime Minister, Shri Narendra Modi at the inauguration of the Dr. Ambedkar National Memorial at 26 Alipur Road, Delhi on April 13, 2018.
అయితే తాము నిర్లక్ష్యం చేసిన ఈ స్మారకాన్ని మోడీ తొందరగా పూర్తి చేయడం తో ఉడుక్కున్న కాంగ్రెస్ ఇలాంటి స్మారక చిహ్నాల ద్వారా అంబేద్కర్ను తామ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని బీజేపీని ఆరోపించింది.
ఈ స్మారక చిహ్నం లో ముఖ్యాంశాలు:
1. మొత్తం 4560 sq. mts 4 అంతస్థుల నిర్మాణం చేశారు. క్రింద 50 కార్లు పట్టే
పార్కింగ్ నిర్మించారు.

3. అంబేద్కర్ భారత రాజ్యాంగం మొదటి కాపీపై పలువురు నేతలు సంతకం చేసిన దృశ్యం


5. అంబేద్కర్ భార్య రమాబాయిపై ఒక ప్రదర్శన

….చాడా శాస్త్రి….