మైనారిటీ లను బుజ్జగించడం, క్రైస్తవ ముస్లిం మతాలను నెత్తిన పెట్టుకోవడం.. కాంగ్రెస్ కు మొదటి నుంచి అలవాటు. అందుకోసం హిందువులని పణంగా పెట్టడం కూడా అంతే అలవాటు. హైందవ సాంప్రదాయాలు అన్నా, దేవీ దేవతలు అన్నా కాంగ్రెస్ పార్టీకి చిన్న చూపు అని మరోసారి రుజువైంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ గా ప్రచారంలో పాల్గొంటున్న పిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొంతమంది హిందువులు హిందువులు అని అంటున్నారని, అసలు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు అని అన్నారు. అంతకుమించి చాలా దుర్మార్గమైన మాటలకు తెగించారు. “శ్రీరాముడు మీకు చిన్నాయన అవుతారా.. సీత మీకు ఏమైనా చిన్నమ్మ అవుతుందా.. అసలు మీరు రాముడి వంశంలో పుట్టారా..! మరి ఎందుకు రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి అని అంటారు..! “. అంటూ చాలా హేళనగా మాట్లాడారు. ఇంత పైత్యం గా మాట్లాడుతుంటే వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నేతలు ఒక్కరూ మాట్లాడలేదు. పైగా సభలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు చప్పట్లు కొడుతూ హర్షం వెలిబుచ్చారు. దీనిని బట్టి దేవీ దేవతలు అన్నా , హైందవమత సంప్రదాయం అన్నా .. కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అభిప్రాయం అనేది మనం తేలికగా తెలుసుకోవచ్చు.
అద్దంకి దయాకర్ చేసిన చౌకబారు వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది . బిజెపి సంఘ్ పరివార సంస్థలు తీవ్రంగా నిరసన తెలుపుతున్నాయి. దీనిమీద వివిధ వేదికల మీద ఫిర్యాదులు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది.