గుజరాత్ లో ఎన్నికల వేళ ఆప్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కిడ్నాప్ వార్త కలకలం రేపింది. ఈస్ట్ సూరత్ నుంచి పోటీలో ఉన్న కంచన్ జరివాలా కనిపించడం లేదంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అంతేకాదు నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ బీజేపీ ఆయనపై ఒత్తిడి చేసిందని…కిడ్నాప్ చేసిందీ బీజేపీ వాళ్లేనని కేజ్రీవాల్ ఆరోపించారు. పార్టీ చీఫ్ ట్వీట్ చేసిన కొన్ని గంటలకో కంచన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకోవడం గమనార్హం. నామినేషన్ పత్రాల పరిశీలన కోసం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన ఆయన ఆ తరువాతకనిపించలేదని బీజేపీ నేతలే కిడ్నాప్ చేశారని డిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సైతం ఆరోపించారు. ఇవాళ అధికారి దగ్గరకు వెళ్లిన ఆయన తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలోనే కార్యాలయం ఎదుట కొద్దిసేపు ఉద్రిక్తం నెలకొంది. రెండుపార్టీల వాళ్లూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు నచ్చజెప్పి ఇరువర్గాల వారినీ పంపించేశారు.