గడచిన వెయ్యి సంవత్సరాలుగా భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు ఇతర మతాలలోకి ఏకపక్షముగా అదే పనిగా జరుగుతున్న మతం మార్పిడిలు, దానివల్ల హిందువుల సంఖ్య క్రమంగా క్షీణించిపోవడం, దీనికి చాలా వరకు మన సామజిక సమస్యలు, మనకి మనమే విధి నిషేధాలు విధించుకొని ముడుచుకొనిపోవటం, దీనిపై సుదీర్ఘకాలం మన సమాజంలో స్పందన లేకపోవటం అటుంచి ఆ సవాలును స్వేకరించి పరిష్కార మార్గాలు వెతకలేకపోయాం.చైతన్య మహా ప్రభు, గురునానక్, గురు గోవింద్ సింగ్, వంటి వారు మతం మార్పిడులకు ఒక కారణమైన హిందూ సమాజంలోని అస్పృశ్యత అనే దాన్ని తొలగించేందుకు చెప్పిన హితోక్తులు హిందూ సమాజం పెడచెవిన పెట్టింది. ఇస్లాం క్రైస్తవాలలోకి విపరీతమైన మతమార్పిడి జరిగిపోయి ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నా పట్టించుకోని దుస్థితి నుండి బయటపడటానికి . ఏకపక్ష మతం మార్పిడులపై మొట్టమొదట గొంతెత్తి కార్యాచరణ ప్రకటించింది ఆర్య సమాజ్ స్థాపించిన స్వామిదయానందసరస్వతి . మన మొట్టమొదటి కర్తవ్యం ఈ మతమార్పిడులు తక్షణమే ఆగిపోయేట్లు చేయటం, రెండవది హిందూ మతంలోకి తిరిగి రావాలనుకొనేవారిని సగౌరవంగా స్వీకరించటం.
శుద్ధి ఉద్యమానికి తెరలేపిన ఆర్యసమాజ్
సిక్కుల లోని రహతియా తెగ వారు 1896 సంవత్సరం తమను శుద్ధి చేసి ఆర్య ధర్మంలోకి తీసుకోవాల్సిందిగా కోరారు. దానిపై స్పందించిన ఆర్యసమాజ్ శుద్ధి కార్యక్రమంతో వారిని హిందూ ధర్మంలోకి తీసుకొని వచ్చి సామాజికంగా, మతపరంగా వారికి ఒక గౌరవాన్ని కలిగించింది. 1898వ సంవత్సరం కల్లా కొన్ని వేల మంది రహతియా తెగవారిని హిందూ ధర్మం లోకి తీసుకొచ్చారు, దాని తర్వాత పంజాబ్లోని సియోల్ కోటలో అంటరాని కులమైన మేఘ్ లో మతాంతరీకరణ అయిన వారి మీద ఆర్యసమాజ్ దృష్టిపెట్టింది, వారిని తిరిగి హిందు ధర్మంలోకి తీసుకొని వచ్చింది. అలా 50 వేల మందికి పైగా తీసుకురాగలరు, అదే మాదిరిగా ముజుఫురానగర్, ముల్తాన్ జిల్లాలోని ఓడులను పంజాబ్ కొండ ప్రాంతాల్లోని దొమ్మలను వేల సంఖ్యలో శుద్ధిచేసి స్వధర్మం లోకి తిరిగి తేగలిగారు. కాశ్మీర్ స్టేట్ లోని మేఘ్ లను 40 వేల మంది పైగా హిందూ ధర్మంలో కి తీసుకుని రాగలిగారు. దీని ప్రభావం మొత్తం మీద 1911 జనాభా లెక్కల ప్రకారం అనేక నగరాలలో రాష్ట్రాలలో ముస్లిం భంగీల సంఖ్య తగ్గి హైందవభంగీల సంఖ్య పెరిగింది. ఆ రోజుల్లో విభిన్న దృక్పథాలు కలిగిన హిందీ పత్రికలు” హిందువులు సంఘటితం కావలసిన అవసరాన్ని ఒక్క గొంతుతో నొక్కి చెప్పాయి” వివిధ వర్గాల వేరువేరు తరగతుల హిందువుల మధ్య ఐక్యత హిందూ ముస్లిం ఐక్యత కంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగిందని స్పష్టంచేశాయి, హిందూ మతపరమైన ఐకమత్యమే సాంస్కృతిక జాతీయ ఐక్యత గా భారతదేశంలో వికసిస్తుంది దానితో మత విశ్వాసానికి సంబంధించినది కాక ఒక జాతీయ ఉద్యమంగా విస్తృత ప్రాముఖ్యత పొందుతుందని హిందూ మహాసభ నాయకుడు వీర సావర్కర్ నూతన శక్తిని సిద్ధాంతీకరించాడు.
శుద్ధి ఉద్యమం పై అనుకూల ప్రతికూల వాదనలు
మతం మార్పిడులపై ”స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్” పుస్తకాన్ని రచించిన R.C మజుందార్ మాటలను ఇక్కడ గమనిద్దాం” అనేక శతాబ్దాలుగా మహమ్మదీయులు హిందువులను మతం మార్పిడి చేస్తూ వచ్చారు, ఇండియాలోని ముస్లింల మెజారిటీ అలా మతంమారిన వారే, అసంఖ్యాక క్రైస్తవ మిషనరీలు మతం మార్పిడి ఉద్యమాన్ని ముమ్మరంగా సాగిస్తున్నాయి, కాబట్టి మతం మారిన వారిని తిరిగి హిందూ ధర్మం లోకి తీసుకోని రావటం కోసం హిందువులకు ఒక మిషన్ ఉండటం ఇప్పుడున్న పరిస్థితుల్లోఅత్యంత అవసరము” అని చెప్పాడు.
మనకు మనమే వాదులాడు కోవడం ప్రమాదాలు కోనితెచ్చుకోవటం ఆ ప్రమాదాలను గుర్తించకపోవడం మొదలైన విషయాలలో ప్రపంచంలో అందరికంటే మన హిందూ సమాజం చాలా ప్రసిద్ధమైనది. మొన్న మొన్నటి చరిత్ర చూస్తే వివేకానందుడు సముద్ర ప్రయాణం చేసిన విషయాన్ని ఆక్షేపించిన గొప్ప పురుషులు మన దేశంలో ఉన్నారు. ఈ పరిస్తితులలో వందల సంవత్సరాలుగా ఏకపక్షంగా సాగిపోతున్న మత మార్పిడులకు అడ్డుకట్టవేసి పునరాగమనం ప్రారంభించిన దయానంద సరస్వతి స్వామిని వ్యతిరేకించిన వారిలో పీఠాధిపతులు కూడా ఉన్నారు, 1895 సంవత్సరంలో మురాదాబాద్ లో 15 మంది శుద్ధి కార్యకర్తలు ఒక క్రైస్తవుడు చేతి నుండి దాహం తీర్చుకోవడానికి గంగా జలం స్వీకరించారని వారిని తీవ్ర పదజాలంతోమత ఛాందసవాదులు ఆక్షేపించారు, వారిని కొందరు సాంప్రదాయ మఠాధిపతులు బహిష్కరణ కూడా చేశారు. ఈ కాలంలో అతివాదులు, కాంగ్రెస్ వాళ్లు, పునరాగమన కార్యక్రమాలను స్వాగతించక పోగా వ్యతిరేకించటం కూడా కనపడుతూ ఉంటుంది, ఇస్లాం గ్రూపులు , క్రైస్తవ సంఘాలు దీంట్లో చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉంటాయి. 1922 సంవత్సరంలో యంగ్ ఇండియా పత్రికలో మహాత్మా గాంధీజీ స్వామి శ్రద్ధానందను ఆక్షేపిస్తూ కథనం రాశారు దానిలో ” శ్రద్ధానంద చేస్తున్న శుద్ధి కార్యక్రమం హిందూ ముస్లింల మధ్య ఉద్రిక్తతలను నిర్మాణం చేస్తున్నదని, స్వామి శ్రద్ధానంద కూడా అవిశ్వాసి గా మారిపోయాడని ఆయన ప్రసంగాలు తరచుగా రెచ్చగొట్టే విధంగా ఉంటాయని నాకు తెలుసు, ముస్లిమేతరులు అందరు ఏదో ఒక రోజు ఇస్లాంలోకి మారతార ని ముస్లిములు చెప్పినట్లుగా ప్రతి ముస్లిం ఏదో ఒక రోజు ఆర్యసమాజ్ లోకి మారతాడు అని శ్రద్ధానంద భావిస్తున్నట్లుగా ఉన్నది అని ఆక్షేపించారు,మరోపక్క శ్రద్ధానంద చాలా తెలివిగలవాడు, ధైర్యవంతుడు గంగానదీ తీరంలో చక్కటి గురుకులాలను నిర్మించాడు, కానీ తొందర పడుతూ ఉంటాడు, ఆర్య సమాజం యొక్క ఆవేశం వారిలో కనపడుతూ ఉంటుంది” అనిరాశారు.జవహర్ లాల్ నెహ్రు 1923 మే 13 న” లీడర్” పత్రికలో మతం మార్పిడి సమస్యను ఇప్పుడు కెలక్కుండా ఉండాలసింది, ఇకనైనా మల్కానాలు సొంత నిర్ణయం తీసుకోనిస్తే మంచిదని వ్రాసాడు .అట్లాగే ప్రపంచంలో అత్యంత ఉదారత కలిగినా హిందూ మతాన్ని సంకుచితంగా మార్చటానికి స్వామి శ్రద్ధానంద చేస్తున్నశుద్ధి కార్యక్రమాలు దోహద పడతున్నాయని విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూ తన కుమార్తె అయిన ఇందిరకు రాసిన ఉత్తరాలలో శుద్ధి ఉద్యమము ఇస్లాం క్రైస్తవ ఆలోచనా ప్రభావంతోనే ప్రారంభమైంది, అది హిందూమత పునరుద్ధరణకు మాత్రమే ఉద్దేశించబడింది, ఇది శక్తివంతమవుతూ హిందూ జాతీయవాదం గా తలెత్తుతున్నది ఒక మిలిటెంట్ ఉద్యమంగా మారి ఇస్లాంకు ప్రత్యర్థిగా మారుతోంది అని వ్యాఖ్యానించారు. డాక్టర్ అంబేద్కర్ స్వామి శ్రద్ధానంద కు సంపూర్ణ మద్దతు ఇచ్చారు, అంటరానితనం నిర్మూలనకు శ్రద్ధానంద అనుసరించిన విధానం ఎంతో ప్రశంసనీయమైనది శ్రద్ధానంద ఒక ఛాంపియన్ అని అంబేద్కర్ పేర్కొన్నారు. శ్రద్ధానంద ప్రారంభించిన శుద్ధి ఉద్యమం ముస్లిములు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. 1926 సంవత్సరం డిసెంబరు 23న అబ్దుల్ రషీద్ శ్రద్ధానంద ను చంపేశాడు, తన వాదనలో ఇస్లాంను రక్షించడానికే అలా చేశానని చెప్పాడు. శ్రద్ధానంద హత్యను ఖండించ ని గాంధీజీ ని కూడా అంబేద్కర్ విమర్శించారు. అంబేద్కర్ 1945 లో పార్టీషన్ ఆఫ్ ఇండియా పుస్తకంలో గాంధీజీ హింసను వ్యతిరేకించడంలో చాలా గట్టి వారు, గట్టిగా ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని సందర్భాల లో మతపరమైన సంస్థల దురాగతాలను ఖండించడం బలవంతంగా చేయవలసి వచ్చింది, కానీ శ్రద్ధానంద చంపటం లాంటి సందర్భాలలో ఎప్పుడూ తమ నిరసనను కూడా వ్యక్తం చేయలేదు ఇది గ్రహించవలసిన విషయం అని వ్రాశారు. అంబేద్కర్ మరో శుద్ధి ఉద్యమకారులైన స్వామి వేదానంద తీర్ధను కూడా బహిరంగంగా ప్రశంసించారు వేదా నంద తీర్థ” రాష్ట్ర రక్షణకు వేద సాధన” అనే పుస్తకం రచించారు , ఆ పుస్తకానికి అంబేద్కర్ ముందుమాట రాశారు దానిలో ఆ పుస్తకం నవ భారతానికి ఒక సువార్త అవుతుందని నేను చెప్పలేను కానీ ఆ పుస్తకం లో వేదాల నుండి సంగ్రహించిన అనేక విషయాలు చాలా స్పష్టంగా కనపడతాయి ఆ భావాలు గొప్ప కార్యాచరణను బయటకు తీసుకుని వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు, ఇప్పటి హిందువులకు శక్తినందించే ప్రాచీన ఆర్యులు ఎప్పుడూ కూడా నిరాశ వాదులు కాదు అని గట్టిగా చెప్పవచ్చు. వంద సంవత్సరాల క్రితం వ్యతిరేకించిన సనాతన వాదులు ఇప్పుడు వ్యతిరేకించడం లేదు పైగా అనుకూలంగా కనబడుతున్నారు ఇది హిందూ సమాజంలో వచ్చిన ఒక గొప్ప పరివర్తన దానిని హిందూ సమాజం యొక్క సంరక్షణకు ఒక గొప్ప మలుపుగా దానిని చెప్పుకోవచ్చు అని కూడా అ రాశారు
హిందూ ముస్లింల మధ్య సంభందాలు ఆందోళన కరంగా ఉన్న ఈ సమయం లో శుద్ధి ఉద్యమం లేకుండా ఉంటె నేను ఎంతో సంతోషించేవాడిని –మోతిలాల్ నెహ్రు
శుద్ధి కార్యకర్తలు బెదిరించి బలవంతంగా మతం మార్పిడులు చేస్తున్నారు – అబుల్ కలామ్ ఆజాద్
ఇట్లా హిందువులు ఏమైనా ముస్లింల కు నష్టం జరగరాదు అనేది కాంగ్రెస్ నీతి. ఇది ఆ తరువాతి కాలంలో లో శుద్ధి ఉద్యమాన్ని బలహీనం చేసింది. కాంగ్రెస్ దేశానికీ స్వాతంత్య్రానికి పూర్వం తరువాత అన్నివిధాలా మతాల మద్య సమస్యలు నిర్మాణం చేసింది అనేది ఒక చారిత్రిక సత్యం.
సామాజిక సమస్యల పరిష్కార దిశలో సంఘ్ ప్రయాణం
అస్పృశ్యతా భావన ఒక మానసికరుగ్మత, ఆ మానసికరుగ్మత నుండి మార్పు తీసుకొనిరావటానికి వందలసంవత్సరాలుగా సుదీర్ఘమైన చర్చలు జరిగాయి కానీ ఇతిమిద్దంగా కార్యాచరణకు రాలేదు , ఈ జాతి లో ఏర్పడిన ఈ మానసిక స్థితి లో మార్పు తీసుకొని రావాటానికి పని చేయగలిగే వాళ్ళు ధార్మిక నాయకులు , ధర్మనిరతి గలపెద్దలు, ధర్మా చార్యులు, పీఠాధిపతులు, మహాత్ములు, ఇటువంటి వారి బోధనలతో ఒక మానసిక విప్లవం తీసుకొనిరాబడుతుంది.ఆ దిశలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సామాజిక సమస్యల పరిష్కారానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రయాణం చేస్తోంది. సామాజిక సమస్యలకు మూల కారణాలైన సామాజిక వికృతులు నుండి సమాజాన్ని బయటపడవేసే కొన్ని కీలక ఘట్టాలను మనం ఇక్కడ గుర్తుచేసుకొందాం
1) 1964 సంవత్సరంలో ముంబైలోని స్వామీ చిన్మయానంద ఆశ్రమంలో పరమపూజ్య శ్రీ గురుజీ స్వయంగా విశ్వహిందూ పరిషత్ ను ప్రారంభింపచేసారు
2) ప్రపంచంలోని హిందువులందరికీ సంబంధించినటువంటి విశ్వహిందూ పరిషత్ ప్రయత్నంతో 1966వ సంవత్సరంలో జనవరి 22, 23,24 తేదీల్లో ప్రయాగలో జరిగిన కుంభమేళ లో చేసిన నిర్ణయాలుహిందూ సమాజంలో ఒక చారిత్రాత్మకమైన మలుపు అని చెప్పవచ్చు . ఆ కార్యక్రమం విశేషమేంటంటే ఒక వెయ్యి సంవత్సరాల కాలఖండంలో కనబడని ఒక దృశ్యం అందరు చూసారు, అదే ఒకే వేదిక మీదకు నాలుగు పీఠాల శంకరాచార్యులవారు కలవడం. అట్లాగే పీఠాధిపతులు, మఠాధిపతులు, సిక్కు , జైన మొదలైనసాంప్రదాయాలకు చెందిన అందరూ ఒకచోట చేరటం. వందల సంవత్సరాలుగా హిందూ సమాజాన్నిపట్టి పీడిస్తున్నఅస్పృశ్యతా మన శాస్త్రాలలో ఏక్కడలేదు అని శంకరాచార్య పీఠాధిపతుల ద్వారా ప్రకటింప చేయటం, అట్లా ప్రయాగలో జరిగిన కుంభమేళా కార్యక్రమంలో విప్లవ శంఖారావం పూరించ బడింది, అప్పటి నుండి క్రమంగా ధర్మాచార్యులు పీఠాధిపతులు, వంటి వాళ్ళు అస్పృశ్య హిందువులను కలవటం మాట్లాడటం ప్రారంభమైంది, అది ఇప్పుడు వేగం అందుకుంది దానికి ఒక చిన్న ఉదాహరణ మొన్న జరిగినటువంటి హిందూ ఏకతా కుంభం కార్యక్రమం.
3) 1973 నుండి 1994 వరకు రాష్ట్రీయ స్వయంసేవకసంఘ సర్ సంఘచాలక్ గ పనిచేసిన పూజనీయ బాలాసాహెబ్ దేవరస్ జీ పూనాలో జరిగే వసంత వ్యాఖ్యానమాల అనే కార్యక్రమంలో అస్పృశ్యత అనేది నేరం కాకపోతే ప్రపంచంలో మరేదీ నేరం కాదు అని ప్రకటించి కార్యాచరణకు పూనుకున్నారు విశేషంగా సమాజంలో సామాజిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు సేవా కార్యక్రమాలను ప్రారంభం చేశారు, తద్వారా అక్కడి ప్రజలలో ఒక ఆత్మవిశ్వాసం, ఒక సామాజిక గౌరవం తీసుకుని వచ్చేందుకు అప్పటినుండి విశేష ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ప్రయత్నాల ద్వారా సామాజిక సమస్యలను అధిగమించటం అనేది స్పష్టంగా ఈ రోజు కనబడుతుంది.
4) 1989వ సంవత్సరంలోడాక్టర్జీ శత జయంతి ఉత్సవాలలో పెద్ద ఎత్తున సేవ నిధి సేకరణ చేసి సేవా కార్యక్రమాలకు అధికార పూర్వకంగా శ్రీకారం చుట్టారు. హరిజన గిరిజన వాడలలో సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇట్లా మతమార్పిడుల సమస్యలకు పరిష్కార మార్గాలు ప్రారంభమైనాయి
5) 2000 సంవత్సరంలో మతం మారిన వారిని తిరిగి మళ్ళీ మాతృ ధర్మంలోకి తీసుకొని రావటానికి పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రారంభించారు. అదే ధర్మజాగరణ విభాగం, దాంతో ఘర్ వాపసీ కార్యక్రమాలు వేగం అందుకున్నాయి. తిరిగి మాతృ ధర్మం లోకి రా దలచుకున్న వారికి స్వాగతం పలకడం మన అందరి బాధ్యత అని ఈ దేశం లో అనేక మంది పెద్దలు గుర్తు చేస్తున్నారు. అట్లాగే శతాబ్దాలుగా మతం మారుతున్న వారి ఎడల అవ్యవహారాన్ని తొలగించి ధర్మరక్షణ కోసం మతం మారిన వారినందరిని తిరిగి తీసుకుని వచ్చేందుకు ఉన్న అడ్డంకులు అన్నింటిని ఒక్కొక్కటి తొలగిస్తూ ముందుకు పోవడం జరుగుతోంది, ఇది ఒక పెద్ద మలుపు అని చెప్పవచ్చు,
6) గడిచిన కొన్ని దశాబ్దాలుగా సంఘం సంఘ ప్రేరణతో ప్రారంభమైన విశ్వహిందూ పరిషత్ చాతుర్వర్ణ వ్యవస్థ నుండి కులాల గుర్తింపు నుండి అధిగమించి మనం హిందువులం అనే గుర్తింపు కోసం పని చేసుకుంటూ వస్తోంది, కుల వివక్షతల నుండి బయటపడటానికి సమాజంలో సామరస్య భావాలను నిర్మాణం చేయటానికి కృషి చేస్తూ వస్తున్నది.
Courtesy :- NewsBharatiyam