కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF…ప్రపంచ ఆర్థిక మాంద్య పరిస్థితులపై కీలక ప్రకటన విడుదల చేసింది. గతేఏడాది కంటే 2023లో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని, ప్రపంచంలోని మూడింట ఒక వంతు దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటాయని హెచ్చరించింది. అమెరికా, ఈయూ, చైనా దేశాలు సైతం ఆర్థిక మందగమనాన్ని చవిచూస్తాయని చెప్పింది. సీబీసీ న్యూస్ ప్రోగ్రాం ‘ఫేస్ ది నేషన్’లో ఐఎంఎఫ్ చీఫ్ క్రిష్టాలినా జార్జీవా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం పది నెలలకు పైగా కొనసాగుతుండటం, ద్రవ్యోల్బణం చుక్కలనంటుతుండటం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, చైనాలో కరోనా తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితిని జార్జీవా విశ్లేషించారు.