టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో నిందితులుగా పేర్కొంటూ అరెస్ట్ చేసిన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలకు షరతులో కూడిన బెయిల్ ఇచ్చింది ధర్మాసనం. 3 లక్షల రూపాయలతో పాటు, ఇద్దరు పూచీకత్తుగా ఉండాలని ఆదేశించింది. ప్రతీ సోమవారం కోర్టుకు హాజరుకావాలనీ ఆదేశించింది ధర్మాసనం. ఇక రామచంద్రభారతిపై మరో రెండు కేసులు కూడా నమోదయ్యాయి. నకిలీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు కలిగి ఉన్నారనే ఆరోపణలపై పోలీసులు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. హైకోర్టు బెయిల్ ఇచ్చినా పోలీసులు మళ్లీ ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. నందకుమార్ పైన కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మరో ఐదుకేసులు నమోదయ్యాయి.