గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. అన్ని డివిజన్లకు తుది ఓటర్ల జాబితాలు విడుదల అయ్యాయి. ఈ నెల 15వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల కానుందని సమాచారం. డిసెంబర్ 6వ తేదీ లోపు పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ నగరంలో 150 డివిజన్లలో పోటీ చేసేందుకు సిట్టింగ్ కార్పొరేటర్లతో పాటు కొత్తవారితో కూడిన జాబితాను సిద్ధం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ఇటీవలీ దుబ్బాక ఎన్నిక విజయంతో మంచి ఊపు మీదుంది. ప్రస్తుతం వార్డు, డివిజన్ స్థాయి కసరత్తు ప్రారంభించింది.
నిబంధనలు ఇలా
జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక అభ్యర్ధి ఒక డివిజన్ నుంచి మాత్రమే పోటీ చేసేందుకు అర్హులు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటు హక్కు ఉన్న అభ్యర్ధి ఏ డివిజన్ నుంచైనా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఒక అభ్యర్ధి రెండు మూడు డివిజన్ల నుంచి నామినేషన్ దాఖలు చేసినా ఉపసంహరణ గడువు నాటికి ఒక్క డివిజన్కు మించి ఉండరాదు. ఒకటి కంటే ఎక్కువ డివిజన్లలో ఉంటే, అన్నీ రద్దవుతాయి. పోటీ చేసేందుకు అర్హత ఉండదు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్సీలకు రెండు, ఎస్టీలకు పది స్థానాలు రిజర్వు కాగా మొత్తంగా మహిళలకు 75 డివిజన్లు రిజర్వు చేశారు. 44 డివిజన్లు అన్ రిజర్వుడ్ కేటరిగి లో ఉన్నాయి.
డివిజన్ల వారిగా రిజర్వేషన్ వివరాలు…
ఎస్టీ,జనరల్– ఫలక్సుమా, ఎస్టీ మహిళ- హస్తినాపురం , ఎస్సీ జనరల్ – కాప్రా, మీర్పేట, హెచ్బీ కాలనీ, జియాగుడ, మచ్చుబొల్లారం, వెంకటాపురం, ఎస్సీ మహిళ- రాజేంద్రనగర్, అడ్డగుట్ట, మెట్టగూడ, బన్సీలాల్ పేట, కవాడిగుడ.
బీసీ (జనరల్) – చర్లపల్లి, సిఖ్చాన్నీ, సంతోష్నగర్, చాంద్రాయనగుట్ట, శాలిబండ, గోషామహాల్, పునరాపూల్, దూల్పేట, జహనుమా, రామ్నాస్పుర, కిషన్భాగ్, శాస్త్రిపురం, దత్తాత్రేయనగర్, కార్వాన్, నానల్నగర్, మొహిదీపట్నం, గుడిమల్కాపుర్, అంబర్పేట, భోలక్పూర్, బొరబండ, రామచంద్రాపురం, పటాన్చెరు, గాజులరామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డినగర్.
బిసీ (మహిళ) – రామంతాపూర్, ఓల్డ్ మలక్పేట, తలాబ్ చంచలం, గౌలిపుర, కుర్మగూడ, కంచన్భాగ్, బార్కాస్, నవాబ్ సాహెబ్ కుంట, ఘాన్సీబజార్, సులేమాన్నగర్, అత్తాపూర్, మంగళ్హాబ్, గోల్కొండ, టోలీచౌకి, అసిఫ్నగర్, విజయనగర్ కాలనీ, అహ్మద్నగర్, మల్లేపల్లి, రెడ్హిల్స్, గోల్నాక, ముషీరాబాద్, ఎర్రగడ్డ, చింతల్, బౌద్దనగర్, రామ్గోపాల్పేట.
మహిళ (జనరల్) – డా.ఎఎస్ రావునగర్, నాచారం, చిలుకానగర్, హబ్సిగూడ, ఉప్పల్, నాగోల్, సరూర్నగర్, రామకృష్ణాపురం, సైదాబాద్, మూసారాంబాద్, అజంపుర, మొగల్పుర, ఇఎస్ సదన్, లంగర్ హౌస్, గన్ ఫౌండ్రి, హిమాయత్నగర్, కాచిగూడ, నల్లకుంట, బాగ్ అంబర్పేట, అడిక్మెట్, గాంధీనగర్, ఖైరతాబాద్, వెంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ, అమిర్పేట, సనత్నగర్, హఫీజ్పేట, చందానగర్, భారతీనగర్, బాలాజీనగర్, అల్లాపూర్, వివి నగర్, సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, అల్వాల్, నేరేడ్మెట్, వినాయకనగర్, మౌలాలి, గౌతంనగర్, తార్నాక, సీతాఫల్మండి, బేగంపేట, మోండా మార్కెట్.
అన్ రిజర్వుడ్ స్థానాలు – మల్లాపుర్, మన్సూరాబాద్, హయత్నగర్, బిఎన్ రెడ్డినగర్, వనస్థలిపురం, చంపాపేట, లింగోజిగూడ, కొత్తపేట, చైతన్యపురి. గడ్డి అన్నారం, అక్బర్ బాగ్, డబీర్పుర, జంగమ్మెట్, బేగంబజార్, మైలార్దేవ్పల్లి, జాంబాగ్, రాంనగర్, బంజరాహిల్స్, షేక్పేట, జూబ్లీహిల్స్, యూసూఫ్గూడ, వెంగళరావునగర్, రహ్మత్నగర్, కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, కెపిహెచ్బీ కాలనీ, మూసాపేట, ఫతేనగర్, ఓల్డ్ బోయిన్పల్లి, బాలానగర్, కూకట్పల్లి, హైదర్నగర్, అల్విన్ కాలనీ, సూరారం, ఈస్ట్ అనంద్బాగ్, మల్కాజిగిరి.
ఓటర్ల సంఖ్య..
మహిళలు : 35,46,731
పురుషులు : 38,56,617
ఇతరులు : 669
మొత్తం : 74,04,017
మొత్తం డివిజన్లు : 150
మహిళా కార్పొరేటర్లు : 76
ప్రస్తుతం పార్టీల వారీగా కార్పొరేటర్లు..
టీఆర్ఎస్ : 99
ఎంఐఎం : 44
బీజేపీ : 04
కాంగ్రెస్ : 02
టీడీపీ : 01
బడ్జెట్ కుదింపు…
జీహెచ్ఎంసీ బడ్జెట్ రాబోయే (2021– 22) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తగ్గించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.6,973.64 కోట్లు కాగా, కొత్త బడ్జెట్ను రూ.5,600 కోట్లకు తగ్గించారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయంలో ఆస్తిపన్ను అంచనా రూ.1,850 కోట్లు కాగా, అప్పులు రూ.1,224.51 కోట్లు. అసైన్డ్ రెవెన్యూ ఆదాయంగా రూ.652.10 కోట్లు ప్రతిపాదించారు