మణిపూర్లో జరిగిన హింసాకాండపై విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీ వేసి విచారణ జరిపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. హింసాకాండకు సంబంధించిన ఆరు కేసులను ప్రత్యేక సీబీఐ బృందం దర్యాప్తు చేస్తుందన్నారు. అందరూ తమ దగ్గరున్నఆయుధాలు అప్పగించాలని… లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆయన గట్టి హెచ్చరికే చేశారు. అమిత్ షా రెండ్రోజులుగా మణిపూర్లోనే ఉన్న సంగతి తెలిసిందే. నాలుగురోజుల పాటు ఆయన అక్కడే పర్యటిస్తారు.
https://twitter.com/AmitShah/status/1664220788139098114?s=20
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రతినిధులతోనూ చర్చలు జరిపినట్టు షా తెలిపారు. ముఖ్యంగా అధికారులు, రాజకీయ పార్టీలు, కుకీ, మెయిటీ తెగల ప్రజల ప్రతినిధులతో చర్చించానని తెలిపారు. హింసాత్మక సంఘటనలకు కారణాలు, అందుకు బాధ్యులు ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు చేస్తామని అన్నారు. గవర్నర్ నేతృత్వంలో శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
ఇక హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 5లక్షల పరిహారం చెల్లించనున్నట్టు అమిత్ షా ప్రకటించారు. ఇక రాష్ట్రంలో కూంబింక్ ఆపరేషన్ రేపటినుంచి ప్రారంభం అవుతుందని ఎవరి దగ్గర అక్రమ ఆయుధాలు ఉన్నా చర్యలు తీసుకుంటామన్నారు. వదంతులు నమ్మవద్దని ప్రజలకు ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది ఉన్న మెయిటీ వర్గాన్ని ఎస్టీల్లో చేర్చాలని ఎప్పటినుంచో ఉన్న డిమాండ్ ను పరిశీలించాలని మణిపూర్ హైకోర్టు ఏప్రిల్ 19న ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ పిలుపుతో మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి.
https://twitter.com/AmitShah/status/1664219650643873793?s=20