ఎన్నికల కమిషనర్ల నియామకాల ప్రక్రియ కోసం ఓ కమిటీ వేయాలని సుప్రీం కోర్టు సూచించింది. ఆ కమిటీలో ప్రధాని, ప్రతిపక్షనేత, సీజేఐ ఉండాలని తెలిపింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ప్యానెల్ సిఫార్సుల మేరకు సీఈసీ, ఈసీలను రాష్ట్రపతి నియమిస్తారనీ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు, ప్రధాన ప్రతిపక్షం, న్యాయ వ్యవస్థల ప్రమేయం కూడా ఉన్నట్టుంటుందని అభిప్రాయపడింది.
ఏ ఎన్నికలనైనా స్వేచ్ఛగా శాంతియుతంగా నిర్వహించడమే ఎన్నికల సంఘం లక్ష్యంగా ఉండాలని…అందుకు న్యాయబద్దంగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు తెలిపింది.
https://twitter.com/ani_digital/status/1631173964734304256?s=20