
file photo
ప్రభుత్వ ప్రకటనల ముసుగులో ఆమ్ ఆద్మీ పార్టీ జారీ చేసిన వాణిజ్య ప్రకటనలకు గాను రూ. 163.62 కోట్ల రికవరీ నోటీసులను ఢిల్లీడైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం జారీ చేసింది. పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఈనోటీసులు అందాయి. 10 రోజుల్లోగా ఈ మొత్తం సొమ్మును తిరిగి చెల్లించాలని నోటీసులో పేర్కొంది. ప్రభుత్వ ప్రకటనల ముసుగులో పార్టీ ప్రకటనలు చేశారని గుర్తించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆరోపించారు. ఆ ప్రకటనల ఖర్చులను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నుంచి వసూలు చేయాల్సిందిగా ఢిల్లీ చీఫ్ సెక్రటరీని ఎల్జీ సక్సేనా ఆదేశించారు.
https://twitter.com/ani_digital/status/1613407737228169216?s=20&t=c_bOOl2HaUQwh4MUGOMY7A