కేరళలోని వాయనాడు వరదల్లో సేవా భారతి విస్తారంగా సేవలు అందిస్తోంది. పగలు రాత్రి తేడా లేకుండా సంఘ్ స్వయం సేవక్ లు మరియు సేవా భారతి కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇంతటి విస్తారంగా సేవలందిస్తున్న సేవా భారతికి తమ వంతు విరాళం అందించేందుకు సమాజంలోని అన్ని వర్గాలు ముందుకు ఈ కదులుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బోథ్ ప్రాంతంలోని
వివేకానంద స్కూల్,సోనాల విద్యార్థులు ముందుకు కదలారు.. గ్రామం అంతట తిరుగుతూ సేవా భారతి సేవ గుణం గురించి విడమర్చి చెబుతున్నారు. స్థానిక వ్యాపారుల నుంచి వాయనాడ్ (కేరళ) వరద బాధితులకు చిరు సహాయంగా విరాళాలు సేకరిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు
కృష్ణ చైతన్య మాట్లాడుతూ
కేరళ వరద బీభత్సంతో వేలమంది నిరాశ్రయులయ్యారు.. వందలమంది తమ ప్రాణాలను కోల్పోయారు అని చెప్పారు. ఆపత్కాల పరిస్థితులకు అనుగుణంగా స్పందించే గుణమును విద్యార్థులలో కలుగ చేయుట కోసం.. ఈ మాదిరిగా విరాళాలను సేకరించడం జరిగింది అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య, ,ఉపాధ్యాయులు అవినాష్,శ్రీనివాస్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
సేకరించిన విరాళాలను మొత్తంగా సేవా భారతికి పంపిస్తామని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.