నిధుల దుర్వినియోగంపై నర్మదా బచావ్ ఆందోళన్ నాయకురాలు మేథాపాట్కర్ సహా మరో 11 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. మధ్యప్రదేశ్లోని బర్వానీ జిల్లాలోని గిరిజన విద్యార్థుల విద్యకోసం అంటూ సేకరించిన నిధులను రాజకీయ, దేశ వ్యతిరేక ఎజెండా కోసం మళ్లించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని మేథాపాట్కర్ అన్నారు. బ్యాంకు ఖాతా, ఖర్చుల ఆడిట్ ఉందని, ఈ ఆరోపణల వెనుక రాజకీయ కారణాలున్నాయని మేధా పాట్కర్ చెప్పారు.ప్రైవేట్ ఫిర్యాదు మేరకు మేధా పాట్కర్ తదితరులపై కేసు నమోదు చేశామని, అందులో ఫిర్యాదుదారు కొన్ని పత్రాలను అందించారని పోలీసులంటున్నారు.
మేథాపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు ఎస్పీ చెప్పారు. ముంబైలో నమోదైన ట్రస్ట్ నర్మదా నవనిర్మాణ అభియాన్ (ఎన్ఎన్ఎ) మధ్యప్రదేశ్,మహారాష్ట్రలోని నర్మదా వ్యాలీలోని గిరిజన విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ విద్యా సౌకర్యాల కల్పన కోసం సేకరించిన నిధులను దుర్వినియోగం చేసిందని బడోలే అనే స్థానికుడు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. 14 ఏళ్లలో పదమూడున్నర కోట్లు వసూలు చేయడా వాటిని రాజకీయ, దేశవ్యతిరేక పనుల కోసం వాడారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో మేధా పాట్కర్, పర్వీన్ రూమీ జహంగీర్, విజయ చౌహాన్, కైలాష్ అవస్య, మోహన్ పాటిదార్, ఆశిష్ మాండ్లోయ్, కేవల్ సింగ్ వాసవే, సంజయ్ జోషి, శ్యామ్ పాటిల్, సునీత్ ఎస్ఆర్, నూర్జీ పద్వీ,కేశవ్ వాసవే పేర్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కార్యకలాపాలకు సంబంధించిన మరిన్ని పత్రాలున్నాయని ఫిర్యాదుదారు చెప్పడంతో దర్యాప్తు మొదలుపెడతామని పోలీసులు తెలిపారు. అయితే ఉద్యమకారిణిని అయిన తనపై ఆరోపణలు కొత్తేం కాదని..అయితే కేసు నమోదుపై తనకేం సమాచారం లేదని మేథాపాట్కర్ అన్నారు . అంతేకాదు ఫిర్యాదుదారు ఆర్ఎస్ఎస్,ఏబీవీపీతో సంబంధం కలిగి ఉండవచ్చని ఆమె ఆరోపించారు. తన సంస్థకు విదేశాల నుంచి నిధులు అందడం లేదని, అన్ని నిధులను ఏటా క్షుణ్ణంగా ఆడిట్ చేయిస్తున్నానన్నారరు.
#BREAKING | Activist Medha Patkar booked for cheating in Madhya Pradesh along with 12 others
Tune in here for more details – https://t.co/hBNv8QrX25 pic.twitter.com/TfJ0Ggm09D— Republic (@republic) July 10, 2022