దేశంలో పెరిగిపోతున్న వికృత సంస్కృతి సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లేనని, సహజీవన బంధాన్ని వివాహంగానే పరిగణిస్తామని సుప్రీం పేర్కొంది. అంతేకాదు సహజీవనంలో కలిగే పిల్లలకు పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందని పేర్కొంది.
కేరళలోని ఎర్నాకులంకు చెందిన ఒక జంట చాలాఏళ్లు సహజీవనం సాగించారు. వారికి ఒక కుమారుడు కూడా పుట్టాడు. అయితే ఆ జంట పెళ్లి చేసుకోనందున ఆ కుమారుడిని అక్రమ సంతానంగా భావిస్తూ, పూర్వీకుల ఆస్తిలో వాటా దక్కదని 2009లో కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే కేరళ హైకోర్టును సవాలు చేస్తూ సుప్రీంకెళ్లారు వాళ్లు. జస్టిస్ ఎస్.అబ్దుల్లా, జస్టిస్ విక్రమ్ నాథ్లతో కూడిన ధర్మాసనం… కేరళ హైకోర్టు తీర్పును తప్పుపట్టింది. ఈ కేసులో తుది డిక్రీ జారీ ప్రక్రియను ఆలస్యం చేసిన ట్రయల్ కోర్టు తీరునూ సుప్రీం తప్పు పట్టింది.