పంచభూతాత్మకమైన అనంత సృష్టిలో మానవుడు ఒక భాగం, అంతే కానీ తానే సర్వస్వం కాదు, సృష్టికి ప్రతి సృష్టి చేయాలనే ఆలోచనలు వినాశనానికి దారి తీస్తాయి అనే విషయాన్ని మనం చరిత్ర నుండి గ్రహించవచ్చు. పంచభూతాత్మకమైన ప్రకృతిలో విలీనం కానీ ఏ పదార్థమైనా అది పర్యావరణానికి సమస్యగా మారుతుంది. ఈరోజు మానవుడు తన అవసరాల కోసం కొండల్ని గుట్టల్ని తొలిచేసే సమతలం చేస్తూ అడవుల అన్నింటిని సమూలంగా నరికివేస్తూ భూమాత ను సంపదవిహీనం గా చేస్తున్నాడు , భూగర్భ జల ప్రవాహాలను వాటి సహజ మార్గాలను మార్చివేసి తనకు అనుగుణంగామళ్ళించివేస్తున్నాడు . భూగర్భ జలాలను అడుగంటించేస్తున్నారు దాని కారణంగా ఈ రోజున మంచినీటి కటకట ఏర్పడుతున్నది. అత్యంత విస్తృతమైన ప్రకృతి వనరులను తన గుప్పెట్లో బంధింప చూస్తున్నాడు, తనకు తానే సర్వశక్తిమంతుడైన సృష్టి స్థితి లయ కారకుడు అని భావించు కుంటున్నాడు , ఇది ప్రకృతి ప్రకోపించనంత కాలం సాగుతుంది ఎప్పుడైతే ప్రకృతి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుందో అప్పుడు సృష్టిలోని ఈ మానవమాత్రుడిన్ని ఎవరు రక్షించగలరు ? అందుకే భారత దేశంలో ఏకాత్మతా అనుభూతి చెందే జీవనము రచించబడింది. ప్రకృతి అనుకూల జీవన విధానం తో ప్రకృతిని కాపాడు కుంటూవస్తోంది . దాని నుంచి బయట పడటం దానికి విరుద్ధంగా వ్యవహరించటం అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈరోజు కాలుష్యం కానీ పంచభూతాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే అన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చెయ్యాలని నినాదం చేస్తున్నారు . కానీ ప్రకృతి అనుకూలంగా జీవించాలనే మాట చెప్పడం లేదు, ప్రకృతికి అనుకూలమైన జీవనం లోకి మానవుడు ఎప్పటివరకైతే మారడో అప్పటివరకు ఏవో సమస్యలు వచ్చి పడుతూనే ఉంటాయి.
ఈరోజు జల సమస్య చాలా తీవ్రంగా ఉంది నదులు సజీవనదులుగా కనబడటం లేదు, ద్వాపర యుగ అంతంనుండి త్రివేణి సంగమం లోని సరస్వతి నది లుప్తం కావటం ప్రారంభమై ఇప్పుడు అంతర్వాహినిగా కనబడుతున్నది ఇట్లా అనేక నదులు ఆ దిశలో ఉన్నాయి కాబట్టి నదులను, వాగులు, వంకలను కాపాడు కోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ దిశలో చేయవలసిన ప్రయత్నం అందరూ చేయాలి. అందుకే మనం ప్రతిరోజు పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచిస్తుంటాం, అది మన జీవితంలో ఒక భాగము, అదే పాశ్చాత్య దేశాలలో సంవత్సరంలో ఒక రోజు పర్యావరణ పరిరక్షణ అనే నినాదం చేస్తారు.
పర్యావరణ విద్వంసం చెయ్యి దాటిపోయే పరిస్థితులలో ప్రపంచ దేశాలు 1974 వ సంవత్సరంజూన్ 5 న ప్రపంచ సదస్సు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమము చేస్తుంది. కరోనా ప్రపంచంలో విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో 47 వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ సంవత్సరం, ప్రకృతితో సంబంధాలనుతిరిగి పునరుద్ధరించుకోవటం పై దృష్టి కేంద్రీకరించబడింది. 2021-2030 దశాబ్దం యుఎన్ లాంఛనంగా . వాతావరణ సంక్షోభంపై పోరాడటానికి, ఒక మిలియన్ జాతుల నష్టాన్ని నివారించుకోవటానికి , మరియు ఆహార భద్రత, నీటి భద్రతా , జీవనోపాధిని పెంచడానికి క్షీణించిన నాశనం చేయబడిన పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణనులక్ష్యంగా పెట్టుకొన్నది. మనదేశంలో కూడా గడిచినరెండు దశాబ్దాల నుండి ప్రకృతి వ్యవసాయం పై ద్రుష్టి సారించి ఇప్పుడుదేశ వ్యాప్తంగా ఆ చరణ లోకి తీసుకోని వస్తున్నది.కొద్దీ సంవత్సరాలపూర్వం దేశ వ్యాప్తం గ విశ్వమంగళ గోగ్రామ యాత్ర జరిగింది దానితో గో ఆధారిత వ్యవసాయం ఊపు అందుకొంది, దాని కొనసాగింపుగానే , ఈ మధ్యనే భూమిసంరక్షణ , భూమిసుపోషణ , దిశలో పెద్దఎత్తున దేశమంతా ఒక ఉద్యమం ప్రారంభమైనది. ఇట్లా మనదేశంలో అనేక ప్రయత్నాలు దేశ వ్యాప్తంగా మొదలైయినాయి.
నీటి సంరక్షణపై అవగాహన పెంచటానికి ఆ నీటి వనరులను కాపాడుకోవటానికి ప్రజలను జాగృతం చేయటానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) మద్రాస్ ‘రివర్స్ ఆఫ్ ఇండియా’ అనే మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది, భారతదేశంలోని 51 నదులుపేర్ల ఆధారంగా.ఆ వీడియో తయారు చేయబడింది . ఆ వీడియో లో పెరుగుతున్న జనాభాపై, నదులను కాపాడుకోవటంపై , నీటి వనరుల దోపిడీ దాని పర్యవసానాల పై, కథనం సాగుతుంది, పర్యావరణ వ్యవస్థల విస్మరణపై హెచ్చరిస్తుంది , ఈ రంగంలో అత్యాధునిక పరిశోధనలనుచేయటానికి కేంద్రం యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది.అదే ఆ మ్యూజిక్ వీడియో మనకు ఇచ్చే సందేశమదే . ఆ వీడియో ను తిలకిద్దాం.