తెలంగాణలోని వర్షప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో అకాలవర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. కొన్నిచోట్ల హెలికాఫ్టర్ నుంచే పరిశీలించిన ఆయన మరికొన్నిచోట్ల…పొలాల్లో దిగి పంటనష్టంపై ఆరాతీశారు. నష్టపోయిన రైతులతో స్వయంగా మాట్లాడారు. పంటల నష్టానికి ఎక్కడైనా ఎకరాకు 3 వేలే ఇస్తారనికానీ తమ ప్రభుత్వం పదివేల చొప్పున పరిహారం ఇచ్చిందని కేసీఆర్ కెలిపారు. ఇప్పుడు కూడా నష్టపోయిన రైతలందరికీ… ఎకరాకు 10వేల చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. తాను స్వయంగా రైతునని రైతుల బాధలు తనకు తెలుసన్న సీఎం ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులను, వ్యవసాయరంగాన్ని ఆదుకునే పాలసీలు, పద్ధతులు ఈ దేశంలో లేవన్నారు. పలువురు మంత్రులు, అధికారులు సీఎం పర్యటనలో ఉన్నారు.
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన – పంటనష్టంపై ఆరా- ఆదుకుంటామని రైతులకు భరోసా
Share: