యూపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో యోగీ సర్కార్ అప్రమత్తమైంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో లక్నో, వారణాసితో పాటుగా మరో ఎనిమిది జిల్లాల్లో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండు వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్న అన్ని జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ నిబంధన తక్షణమే అమలవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. రాత్రి 8.00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7.00 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. కాగా, బుధవారం నాడు యూపీలో రికార్డు స్థాయిలో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.