ఉత్తరప్రదేశ్లో కన్వర్ యాత్ర వైభవంగా సాగుతోంది. కన్వర్లకు ఊరూరా స్వాగతం పలుకుతున్నారు. ఇక సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశం మేరకు అధికారులు కన్వీరీల యాత్రకు అడ్డంకులు లేకుండా చూస్తున్నారు. ఇక ఘజియాబాద్ సహా పలు చోట్ల కన్వరీలపై జనం, అధికారులు పూలవర్షం కురిపిస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. హెలికాఫ్టర్ల నుంచి కూడా వారిమీద పూలజల్లులు కురిస్తున్నారు. రోడ్డుమార్గం గుండా వెళ్లేవారిపై క్రేన్ల సాయంతో పూలు కురిపిస్తున్నారు.ఇక స్వయంగా యోగీనే ఏరియల్ సర్వే ద్వారా ఈ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
https://twitter.com/ndtv/status/1551531305082691585?s=20&t=Qf-lWj5FA6vKgTY0osb83w
యూపీలో ఏటా కావడ్ యాత్ర జరుగుతుంది. కొందరు భక్తులు కావడి మోస్తూ వెళ్లి హరిద్వార్, రిషికేశ్ వెళ్లి గంగాజలాన్ని తీసుకుని వచ్చి… తమ స్వగ్రామాల్లోని శివాలయానికి అభిషేకం చేస్తారు. అలా యూపీనుంచి గ్రామగ్రామాలనుంచి కన్వర్లు బయల్దేరుతారు. కిందటేడు కరోనా వల్లయాత్ర నిలిచిపోయింది. ఈసారి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం ..ఏకంగా హెలికాఫ్టర్లతో వారిపై పూలు కురిపిస్తోంది.