ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యట కు సమాచారం పంపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేందుకు న విజయవంతం అయింది అని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు తగినట్లుగా ప్రతి రోజు క్రమం తప్పకుండా పత్రికలు టీవీ చానల్స్ఈ పర్యటన చేపట్టినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే భారీ ఒప్పందాలు కుదురాయని, రానున్న రోజుల్లో పెట్టుబడులు విస్తారంగా వస్తాయి అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.
కానీ ముఖ్యమంత్రి పర్యటన లో కొన్ని అంశాలు వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యమంత్రి సోదరుడు జగదీశ్వర్రెడ్డికి చెందిన స్వచ్ఛ బయోగ్రీన్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం, ఈ విషయమై వివాదం చెలరేగడంతో వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం ఆ కంపెనీ వివరాలను స్వల్పంగా మార్చుతూ మరేదో చేయడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ లో ప్రకటించిన పెట్టుబడి ప్రణాళిక వివాదంకు దారితీసింది.
“ఉత్తేజకరమైన వార్తలు! ముఖ్యమంత్రి @revanth_anumula, పరిశ్రమలు ఐటి మంత్రి @OffDSB తో ఉత్పాదక సమావేశం తరువాత, స్వచ్ఛ్ బయో, లిగ్నోసెల్యులోసిక్ బయోఫ్యూయల్స్ తయారీ కంపెనీ, తెలంగాణలో 250 కేఎల్ పిడి (రోజుకు కిలో లీటర్లు) బయోఫ్యూయల్ ప్లాంట్కు ప్రణాళికలను ప్రకటించింది”అని సిఎంఓ హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణలో సుస్థిర వృద్ధిని పెంపొందించడంతోపాటు పెట్టుబడులు 500 ఉద్యోగాలను సృష్టిస్తాయని సీఎంఓ పేర్కొంది.
సీఎంఓ ట్వీట్లో పేర్కొన్న స్వచ్ఛ్ బయో అనే సంస్థకు డిజిటల్ ఉనికి లేదు. ఇది అమెరికాలో ఉన్నట్లు కనిపించడం లేదు. అంతేకాదు ముఖ్యమంత్రి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి అనుముల పేరుతో స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రిజిస్టర్ చేయబడింది.
ప్రవీణ్ పరిపాటి అని సీఎంవో ట్వీట్లో పేర్కొన్నారు. అతనికి, స్వచ్ఛ్ బయోకి మధ్య ఎటువంటి సంబంధం లేనప్పటికీ, అతను వర్జీనియా-ఆధారిత సుగానిట్ సిస్టమ్స్ యజమాని. 2006లో స్థాపించిన ఈ సంస్థ ప్రధానంగా జీవ ఇంధనాలతో వ్యవహరిస్తుంది.
సీఎంఓ ట్వీట్ తర్వాత, వాస్తవంగా తెలియని కంపెనీ తెలంగాణాలో రూ. 1000 కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందనే దానిపై చాలా మంది అనుమానాలు లేవనెత్తారు.
అమెరికాలోని కార్పొరేషన్లను ట్రాక్ చేసే ప్లాట్ఫారమ్ అయిన నేషనల్ కార్పొరేషన్ డైరెక్టరీలో స్వచ్ఛ్ బయోపై ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు అని తెలుస్తోంది. హైదరాబాద్లో రిజిస్టర్ అయిన స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సీఎంఓ ట్వీట్లో ప్రస్తావించినట్లు ఆరోపణలు వచ్చాయి. పైగా
21 జూలై 2024న రిజిస్టర్ అయినట్టు చెబుతున్నారు . అంటే ఈ కంపెనీ రెండు వారాల క్రితమే ఏర్పాటు చేసినది. వేదవల్లి శివానంద రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి అనుముల కలిసి ఈ కంపెనీని నిర్వహిస్తున్నారు. కంపెనీని పానీయాల తయారీదారుగా నమోదు చేశారు. బోగస్ కంపెనీలతో సర్కారు ఒప్పందాలు చేసుకున్నటున్నదని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తూ ఉండడంతో పరువు కాపాడుకోవడానికి ప్రభుత్వం ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ వంటి ఐఏఎస్లతో ప్రకటనలను గుప్పిస్తున్నది. తెలంగాణ అభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను రాబట్టడంలో అమెరికా పర్యటన సజావుగా సాగుతున్నదని, ఒప్పందాలు, మీటింగ్లపై అపోహలేమీ పెట్టుకోవద్దని జయేశ్రంజన్ వివరణ ఇవ్వడమే దీనికి రుజువు. మంత్రులెవ్వరూ ఈ ఒప్పందాల గురించి మాట్లాడకపోవడం గమనార్హం..
దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు వస్తే తప్ప నాయకులు మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిపక్షాలకు ఇది ఒక ఆయుధంలా మారే పరిస్థితి కనిపిస్తోంది.