నిరసనకు దిగనున్నసీఎం మమతా బెనర్జీ.. ఎందుకో తెలుసా..?
We will stage a protest march in Siliguri tomorrow against the rise in cooking gas price, carrying LPG cylinders during the protest: West Bengal CM Mamata Banerjee at Bagdogra airport in Siliguri pic.twitter.com/Z3yQWCwI0t
— ANI (@ANI) March 6, 2021
వెస్ట్ బెంగాల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. సీఎం మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టీఎంసీ పార్టీకి చెందిన కీలక నేతలంతా వరుసగా పార్టీని వీడుతూ.. కమలం గూటికి చేరుతుండటంతో తలపట్టుకుంటున్నారు. ఇక రూట్ మార్చాలని ఆలోచించిన దీదీ.. నిరసనలకు దిగబోతుంది. ఆదివారం నాడు సిలిగురిలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. వంట గ్యాస్ ధరలు నింగిని తాకుతున్నాయని.. సామాన్యుడికి ఇది తీవ్ర భారంగా మారిందని మమతా అన్నారు. ఎల్పీజీ గ్యాస్ ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిలిగురిలో నిరసన చేపడుతున్నట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు.