హైదరాబాద్లో మెట్రో సెకండ్ ఫేజ్కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకూ 31 కి.మీ. మేర మెట్రో లైన్ నిర్మాణం సాగనుంది. అంచనా వ్యయం 6వేల 250 కోట్లు కాగా… మూడేళ్లలో నిర్మాణపనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ప్రాజెక్ట్ పూర్తైతే రాయదుర్గ్ నుంచి కేవలం 20 నిమిషాల్లో ఎయిర్ పోర్టుకు చేరుకోవచ్చు. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం తన సొంత నిధదులతో ఈ ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మాణపనులు చేపడుతోంది. శంకుస్థాపన అనంతరం రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కేటీఆర్ సహా పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.