ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి జగన్ భార్య భారతి తో సహా బయలుదేరారు. జగన్ కుమార్తెలిద్దరూ విదేశాల్లో చదువుకుంటున్నారు వాళ్లతో కలిసి గడిపేందుకు ఈ ప్రయాణం పెట్టుకున్నట్లు తెలుస్తోంది .ఈ సందర్భంగా యూకే, స్విట్జర్లాండ్లో పర్యటించ నున్నారు సీఎం జగన్. ఈ పర్యటన తర్వాత తిరిగి ఈ నెల 31న రాష్ట్రానికి వస్తా రని తెలుస్తోంది.
ఎన్నికల ఫలితాలకు నాలుగు రోజులు ముందు తిరిగి రాష్ట్రానికి వస్తారు.
ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన మీద ముందుగానే సమాచారం బయటకు పొక్కింది. ఆయన మీద కేసులు విచారణలో ఉన్నందున విదేశీ పర్యటన కోసం సిబిఐ కోర్టు ని ఆశ్రయించారు.
అయితే జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ ఇదే న్యాయస్థానం లో కౌంటర్ దాఖలు చేసింది
ఇరు వైపులా వాదనలు విన్న కోర్టు.. జగన్ విదేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ వివరాలు కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని జగన్ను నాంపల్లి కోర్టు ఆదేశించింది.
ఈ నెల 13న పోలింగ్ పూర్తికాగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.
అయితే ఎన్నికల్లో ఓటమి తప్పదు అని తెలిసి జగన్ ముందుగానే విదేశాలకు వెళ్లిపోతున్నారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. ఒకానొక దశలో ఈ ప్రచారం ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బంది కూడా తెచ్చి పెట్టింది. దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం వైసీపీ నేతలు ఏర్పడింది . ఇప్పటికీ కూడా ఈ ట్రోలింగ్ మాత్రం అలాగే కొనసాగుతారు.