
Supreme Court of India
ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ 2022 డిసెంబర్లో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్రం త్వరలోనే క్లియరెన్స్ ఇవ్వనున్నట్టు భారత అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అత్యు్న్నత న్యాయస్థానానికి తెలియజేశారు. పెండింగ్లో ఉన్న కొలీజియం సిఫార్సుల తాజా పరిస్థితిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఏజీ సమాధానమిస్తూ, జడ్జీల నియామకాలను ఆదివారంనాడు జారీ చేయనున్నట్టు కోర్టుకు తెలిపారు.