ఓఎంసీ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట దక్కింది. ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమెపై ఉన్న అభియోగాల్ని ధర్మాసనం కొట్టేసింది. ఓఎంసీ నుంచి ముడుపులు తీసుకున్నారని శ్రీలక్ష్మి ఆరోపణలు ఎదుర్కొన్నారు. సీబీఐ కేసు నమోదు చేయడంతో ఏడాదిపాటు ఆమె జైల్లో గడపాల్సి వచ్చింది.
2004 – 2009లో శ్రీలక్ష్మి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఆ సమయంలో పలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. మైనింగ్కు పాల్పడిన వారికి శ్రీలక్ష్మి సహకరించారని..అందుకు భారీగా ముడుపులు తీసుకున్నారని సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేనందును కేసును కొట్టివేస్తూ ఆమెకు హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు క్లీన్చిట్ ఇవ్వడంతో శ్రీలక్ష్మి ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యేందుకు ఆమెకున్న అడ్డంకులు తొలగిపోయినట్టైంది.