రాజస్థాన్ సంక్షోభంలో ఆరాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ప్రమేయం లేదని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెల్చింది. ఆయనకు పార్టీ క్లీన్ చిట్ ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో గెహ్లాట్ తెరపైకి రావడం…సీఎంగా సచిన్ పైలట్ పేరు చర్చలోకి రావడంతో గెహ్లాట్ వర్గానికి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలకు కారణం గెహ్లాటేనని అధిష్టానం భావించింది. ఆయనపై చర్యలకు సిద్ధమైందన్న వార్తలూ వినిపించాయి. అయితే అందులో ఆయన ప్రమేయం లేదని పార్టీ పరిశీలకులు తేల్చిచెప్పారు. గెహ్లాట్ వర్గీయులు శాంతి ధావల్, ప్రతాప్ సింగ్ ఖచరియావాస్, చీఫ్విప్ లే ఇదంతా చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి నివేదికర ఇచ్చారు. ఈ మేరకు వారికి పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అలాగే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక వరకూ గెహ్లోత్నే సీఎం పదవిలో కొనసాగించాలని నిర్ణయించింది. ఈ సంక్షోభం నడుస్తుండగానే పార్టీ మరో సీనియర్ నేత మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ను రంగంలోకి దింపారు. పార్టీ అధ్యక్షపదవిలో ఆయన్ని నిలిపే అకాశాలున్నాయని చెబుతున్నారు. మరోవైపు పార్టీ నాయకత్వం చర్చలకు పిలిస్తే కలుసుకునేందుకు వీలుగా సచిన్ పైలట్ ఢిల్లీ చేరుకున్నారు.